Deadly Explosion In Nigeria: నైజీరియాలో భారీ పేలుడు... 70 మంది మృతి, గ్యాసోలిన్ బదిలీ చేస్తుండగా ప్రమాదం, భారీగా ప్రాణ,ఆస్తి నష్టం

ఉత్తర-మధ్య నైజీరియాలో జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 70 మంది మరణించారని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (NEMA) తెలిపింది.

Gasoline Tanker Blast in Nigeria, 70 dead(ANI)

Delhi, January 19:  ఉత్తర-మధ్య నైజీరియాలో జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 70 మంది మరణించారని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (NEMA) తెలిపింది. శనివారం తెల్లవారుజామున నైజర్ రాష్ట్రంలోని సులేజా పట్టణంలో కొంతమంది వ్యక్తులు జనరేటర్ ఉపయోగించి ఒక ట్యాంకర్ నుండి మరొక ట్యాంకర్‌కు గ్యాసోలిన్‌ను బదిలీ చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది.

దీంతో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. కార్గో రవాణాకు సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రధాన రహదారులపై తరచుగా ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో నైజీరియాలో ఇంధనాన్ని రవాణా చేయడం వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టలేకపోతున్నామని వెల్లడించారు. ప్రాణాంతకంగా మారుతున్న హెచ్‌ఎంపీవీ వైరస్‌, బంగ్లాదేశ్‌లో తొలి మరణం నమోదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న నిపుణులు 

అయితే ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబర్ 2024లో, పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ట్యాంకర్ ఢీకొట్టడంతో మరో గ్యాసోలిన్ ట్యాంకర్ పేలుడులో కనీసం 48 మంది మరణించారు. నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదాల ప్రమాదం ఎక్కువగా ఉంటోంది.

2020లోనే 1,531 ట్యాంకర్ ప్రమాదాలు నమోదయ్యాయి. దీని ఫలితంగా 535 మంది మరణించగా 1,142 మంది గాయపడ్డారని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement