Good News For Sankranti: సంక్రాంతి వేళ రైల్వే శాఖ శుభవార్త.. విశాఖ-హైదరాబాద్ వందేభారత్ రైలుకు అదనంగా 8 బోగీలు.. అందుబాటులోకి మొత్తంగా 16 కోచ్ లు

సంక్రాంతి రద్దీ వేళ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణించే వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలు (20707/20708) బోగీలను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

A screengrab of the video. (Photo credits: Twitter/@imvivekgupta)

Hyderabad, Jan 12: సంక్రాంతి (Sankranti) రద్దీ వేళ.. తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణించే వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలు (20707/20708) బోగీలను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం 8 కోచ్‌ లతో రైలు ప్రయాణిస్తుండగా సోమవారం నుంచి మరో 8 జోడిస్తున్నట్టు తెలిపింది. దీంతో మొత్తం కోచ్‌ల సంఖ్య 16కు పెరగనుంది. అలాగే, ప్రస్తుతం 530 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, రేపటి నుంచి 1,128 సీట్లు అందుబాటులోకి వస్తాయి.

తెలంగాణలో త్వరలో కొత్త బ్రాండ్‌ బీర్లు, విస్కీ, నూతన కంపెనీలు అప్లై చేసుకునేందుకు నోటిఫికేషన్‌ విడుదల

చైర్‌ కార్‌ల సంఖ్య 14

గత ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన విశాఖపట్నం-హైదరాబాద్ వందే భారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ కోచ్ 1, చైర్‌ కార్‌ లు 7 ఉన్నాయి. తాజా పెంపుతో ఎగ్జిక్యూటివ్ కోచ్‌ల సంఖ్య రెండుకు, చైర్‌ కార్‌ ల సంఖ్య 14కు పెరుగుతుంది.

తప్పైపోయింది.. క్షమించండి, తనను రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి, వివాదానికి ముగింపు పలికిన దిల్ రాజు 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement