Group 2 Exams Today: నేడు, రేపు గ్రూప్‌-2 పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్‌

నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి.

Hyderabad, Dec 15: నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 పరీక్షలకు (Group 2 Exams) సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి. నాలుగు పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షాకేంద్రాలను (Exam Centres) ఏర్పాటు చేశారు. 783 పోస్టుల భర్తీకి 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్‌ లో పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు ప్రతి సెంటర్‌ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రతీ అభ్యర్థి బయోమెట్రిక్‌ హాజరును నమోదుచేయాలని, లేదంటే జవాబుపత్రాన్ని తిరస్కరిస్తామని వెల్లడించారు. మార్చిలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు.

అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్, అరెస్ట్‌పై ఆరా, బన్నీ ఇంటికి క్యూ కడుతున్న హీరోలు

వారి పరిస్థితి??

5.51లక్షల మంది అభ్యర్థుల్లో ఇప్పటి వరకు కేవలం 77% మంది అభ్యర్థులు మాత్రమే హాల్‌ టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. మరి మిగతావారు పరీక్షకు హాజరు అవుతారా? లేదా అని సస్పెన్స్ కొనసాగుతుంది.

అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించిన హీరోయిన్ శ్రీలీల

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement