Bengaluru Horror: ప్రియుడు కాదు కామాంధుడు, ఆ ఫోటోలను చూపిస్తూ స్నేహితులతో కలిసి ప్రియురాలిపై పదే పదే అత్యాచారం

బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై డ్యాన్స్ టీచర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అరెస్టయిన వ్యక్తులను ఓ ప్రైవేట్ స్కూల్‌లో డ్యాన్స్ టీచర్ ఆండీ జార్జ్, సంతోష్, శశిగా గుర్తించారు.

Assault (Image used for representational purpose only) (Photo Credits: ANI)

బెంగళూరు, ఆగస్టు 1: బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై డ్యాన్స్ టీచర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అరెస్టయిన వ్యక్తులను ఓ ప్రైవేట్ స్కూల్‌లో డ్యాన్స్ టీచర్ ఆండీ జార్జ్, సంతోష్, శశిగా గుర్తించారు.

దారుణం, శృంగారానికి నిరాకరించిందని అత్త తలను గోడకేసి బాది చంపిన అల్లుడు, అనంతరం పని ముగించుకుని..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోషల్ మీడియా ద్వారా ఆండీ.. బాధితురాలు కాలేజీ విద్యార్థినితో స్నేహం చేశాడు. వారి ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. నిందితుడిపై అనుమానం, భయం పెరగడంతో బాలిక అతడికి దూరం అయింది. అనంతరం వారి వ్యక్తిగత చిత్రాలను షేర్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి బాధితురాలిపై అత్యాచారం చేశాడు. అతను ఈ చర్యను రికార్డ్ చేశాడు. ఈ ఫుటేజీని ఉపయోగించి అతను ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ పదే పదే అత్యాచారం చేశాడు.

దారుణం, ఇద్దరు కూతుర్లపై 18 నెలల నుంచి తండ్రి స్నేహితులు అత్యాచారం, గర్భం దాల్చడంతో ఘటన వెలుగులోకి..

నిందితుడు తన స్నేహితులను ఇంటికి పిలిచి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. నిందితుడు ఆమె ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాధితురాలు ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి అనేక కేసుల్లో నిందితులు, ముఖ్యంగా ప్రధాన నిందితుడు ఆండీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement