NEET-UG Exam Paper Leak Case: నీట్ ప‌రీక్షా ప‌త్రం లీక్ వ్య‌వ‌హారంలో కీల‌క ట్విస్ట్, ప‌రీక్ష నిర్వ‌హ‌ణలో అవ‌క‌త‌వ‌కలపై ఎఫ్ఐఆర్ న‌మోదు

నీట్‌ నిర్వహణలో అవకతవకలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీట్‌ వ్యవహారంపై (NEET-UG Exam) విచారణ మొదలుపెట్టిన సీబీఐ (CBI).. బిహార్‌లో జరిగిన పేపర్‌ లీక్‌తో పాటు గ్రేస్‌ మార్కుల వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేసింది.

NEET (File Image)

New Delhi, June 23: నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటగా నీట్‌ పరీక్షను నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) ప్రక్షాళనకు ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఆ తర్వాత ఎన్టీయే డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌ను పదవి నుంచి తొలగించింది. ప్రస్తుతం ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌(ITOP) చైర్మన్‌, ఎండీగా ఉన్న ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాకు ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

 

ఈ క్రమంలోనే నీట్‌ లీక్‌ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. లీక్‌ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.