Haryana Shocker: గదిలో బంధించి మత్తుమందు ఇస్తూ..తొమ్మిది రోజలపాటు మహిళపై అత్యాచారం, నిందితుల్లో ఒకరు పోలీస్ కానిస్టేబుల్‌, హర్యానాలో సోహ్నా గ్రామంలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను దుండగులు అపహరించి ఓ గదిలో నిర్బంధించారు. తొమ్మిది రోజులపాటు లైంగికంగా (Woman held captive for nine days raped) వేధించారు. ఎట్టకేలకు బాధితురాలు వారి చెర నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Gurgaon, Jul 14: హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను దుండగులు అపహరించి ఓ గదిలో నిర్బంధించారు. తొమ్మిది రోజులపాటు లైంగికంగా (Woman held captive for nine days raped) వేధించారు. ఎట్టకేలకు బాధితురాలు వారి చెర నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.హర్యానాలో సోహ్నా (Haryana) గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

వారి తెలిపిక కథనం ప్రకారం.. సోహ్నా గ్రామానికి చెందిన వివాహిత(20) గత నెల 30న తనతో పరిచయం ఉన్న వ్యక్తితోనే మాట్లాడుతుండగా.. అతని ఇద్దరు స్నేహితులు కారులో వచ్చి ఆమెను అపహరించారు. మరో వ్యక్తితో కలిసి నలుగురు దుండగులు ఆమెను ఫరిదాబాద్‌లో ఓ గదిలో నిర్భందించి పలుమార్లు అత్యాచారానికి (Rape) పాల్పడ్డారు. తొమ్మిది రోజుల తర్వాత అంటే జులై 8న ఆమె వారి నుంచి తప్పించుకొని భల్లబ్‌గఢ్‌ బస్‌స్టేషన్‌ చేరుకుంది. అక్కడి నుంచి వారి కుటుంబానికి ఫోన్‌ చేసింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అహరించిన వారు తనకు తెలుసని, వారిలో ఒకరు పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

అనాథనంటూ..ముగ్గురుని పెళ్లి చేసుకున్న యువతి, మామకు మాయమాటలు చెప్పి రూ. 2 లక్షలతో పరార్, ఎట్టకేలకు యువతిని అరెస్ట్ చేసిన అలిపిరి పోలీసులు

దీంతో పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు బాధితురాలికి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సహకరించిన తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇతను నడుపుతున్న ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలోకి వచ్చి నిందితులు దాడి చేశారు. దీంతో ఈ కేసులపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

నీ భార్యతో ఉంటే ఎమ్మెల్యే కాలేవు, జ్యోతిష్కుడు మాటలు నమ్మి భార్యను చిత్రహింసలకు గురి చేసిన ఓ భర్త, తట్టుకోలేక 8 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత భార్య, పూణేలో ఘటన

పోలీసు కానిస్టేబుల్‌తో సహా నిందితులు ఆమెకు మత్తుమందులు వేయడంతో ఎక్కువ సమయం స్పృహ తప్పిందని ఆ మహిళ తన పోలీసు ఫిర్యాదులో ఆరోపించింది. అత్యాచారం, కిడ్నాప్, ఎస్సీ / ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టంలోని సంబంధిత విభాగాలతో సహా ఐపిసిలోని వివిధ నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడి పేరున్న కానిస్టేబుల్‌ను ఫరీదాబాద్‌లో పోస్ట్ చేసినట్లు సోహ్నాలోని పోలీస్ స్టేషన్ సదర్ ఇన్స్పెక్టర్ ఉమేష్ కుమార్ తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement