Karnataka Shocker: కామాంధుడైన అయ్యవారు, విద్యార్థిని తల్లిపై అత్యాచారం, వీడియో తీసి అడిగినప్పుడు రావాలని బెదిరింపులు, పోలీసులుకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ కామాంధుడైన టీచర్ విద్యార్థిని తల్లిపై అత్యాచారం చేసి ఆ ఘటనను వీడియో తీశాడు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు రావాలని లేదంటే వీడియోని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

Rape Representative image.

Raichur, July 3: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ కామాంధుడైన టీచర్ విద్యార్థిని తల్లిపై అత్యాచారం చేసి ఆ ఘటనను వీడియో తీశాడు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు రావాలని లేదంటే వీడియోని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఘటన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. సదరు ఉపాధ్యాయుడిని స్కూలు నుండి సస్పెండ్ (Teacher Suspended ) చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకలోని రాయచూర్‌లోని సింఘాపుర ప్రభుత్వ పాఠశాలలో మహ్మద్ అజారుద్దీన్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇతను గతంలో పాఠశాల విద్యార్థులను దుర్భాషలాడాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ విద్యార్థిని తల్లికి ఆశచూపి లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. మీ కూతురుకు ట్యూషన్, ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని టీచర్ దాదాపుగా బలవంతం చేశాడని ( Forcing Student’s Mother for Sex) విద్యార్థిని తల్లి ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఘటనను నిందితుడు టీచర్ వీడియో తీశాడు.

అయోధ్య ఆలయంలో వ్యక్తి గొంతు కోసి దారుణ హత్య, అరుగుపై పడుకుని నిద్ర పోతుండగా ఘాతుకానికి పాల్పడి బంధువు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

అనంతరం బ్లాక్ మెయిల్ కి దిగాడు. తను అడిగినప్పుడల్లా రావాలని లేదంటే ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలు ఒప్పుకోకపోవడంతో ఈ వీడియోని సోషల్ మీడియాలో (Circulating Video in Raichur) పెట్టాడు. దీంతో బాధితురాలు కరటగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు నిందితుడు టీచర్ స్కూల్ పిల్లలపై కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. వారి వ్యక్తిగత భాగాలను తాకడం అతని ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ ఉపాధ్యాయుడిని రాయచూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ అజారుద్దీన్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Mamunoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం

Maharashtra Shocker: సహోద్యోగిని ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్, రూంకి వచ్చి సుఖ పెట్టకుంటే వైరల్ చేస్తానని బెదిరింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

Hindi Language Row in Tamil Nadu: వీడియో ఇదిగో, తమిళనాడులో బోర్డుల మీద హిందీ అక్షరాలను చెరిపేస్తున్న డీఎంకే కార్యకర్తలు, కొత్త విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం

Advertisement
Advertisement
Share Now
Advertisement