Manipur Violence: మణిపూర్ హింసపై షాకింగ్ డేటా విడుదల చేసిన పోలీసులు, 175 మంది ప్రాణాలు కోల్పోగా 96 మృతదేహాలు ఇంకా మార్చురీలోనే..

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో గత కొన్ని నెలలుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో కల్లోల పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మే 3న ప్రారంభమైన ఈ ఘర్షణలు నేటికి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకూ 175 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.

Both Meitei, Kuki Women Hold Massive Protests Across Manipur (File Photo)

Imphal, Sep 15: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో గత కొన్ని నెలలుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో కల్లోల పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మే 3న ప్రారంభమైన ఈ ఘర్షణలు నేటికి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకూ 175 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. 175 మందిలో ఇప్పటికీ గుర్తించని 96 మృతదేహాలు మార్చురీలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఘర్షణల్లో 1,118 మంది గాయపడ్డారని.. సుమారు 33 మంది అదృశ్యమైనట్లు ఆ రాష్ట్ర పోలీసులు డేటా విడుదల చేశారు.

నగ్నంగా మహిళల ఊరేగింపు వీడియోలు వైరల్, వెంటనే తొలగించాలని ట్విటర్‌కు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఆ డేటా ప్రకారం.. ఈ హింసలో కనీసం 5,172 అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో 4,786 ఇళ్లు, 386 మతపరమైన ప్రదేశాలకు (254 చర్చిలు, 132 దేవాలయాలు) అల్లరి మూకలు నిప్పు పెట్టారు. హింస ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్ర ఆయుధగారం నుంచి 5,668 ఆయుధాలు లూటీకి గురయ్యాయి. అందులో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. అదేవిధంగా అల్లరి మూకల నుంచి 15,050 మందుగుండు సామగ్రి, 400 బాంబులు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రంలో కనీసం 360 అక్రమ బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement