Bonfire On Train: సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో పొగ‌లు, ట్రైన్ ఆపి చూస్తే లోప‌లు చ‌లికాచుకుంటున్న ప్ర‌యాణికులు, త‌ర్వాత ఏమైందంటే?

రైలు అలీగఢ్‌ జంక్షన్‌ చేరిన వెంటనే జనరల్‌ బోగిలోని 16 మంది ప్రయాణికులను ఆర్పీఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. రైలు చలి మంట ఎవరు వేశారన్నదానిపై ఆరా తీశారు. ఈ పని తాము చేసినట్లు ఫరీదాబాద్‌కు చెందిన 23 ఏళ్ల చందన్, 23 ఏళ్ల దేవేంద్ర ఒప్పుకున్నారు.

Credits: Google (Representational Image)

New Delhi, JAN 06: చలిని తట్టుకునేందుకు కొందరు వ్యక్తులు కదులుతున్న రైలులో చలి మంట వేశారు. (Bonfire On Train) జనరల్‌ బోగిలోని ప్రయాణికుల్లో కొందరు ఆ మంట వద్ద చలి కాచుకున్నారు. అయితే రైల్వే గేట్‌ను క్రాస్‌ చేస్తుండగా రైలులో మంటలు, పొగలను గేట్‌మ్యాన్‌ చూశాడు. వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్‌ చేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగిలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళ చలిని తట్టుకోలేక మంటను రాజేశారు. ఆ ఇద్దరితోపాటు ఆ బోగిలోని మరి కొందరు కూడా ఆ మంట వద్ద చలి కాచుకున్నారు.

Alaska Airlines Incident: అన్ని బోయింగ్ 737–8 మాక్స్ విమానాల డోర్లు వెంటనే తనిఖీ చేయండి, విమానయాన సంస్థలను ఆదేశించిన డీజీసీఏ 

కాగా, బర్హాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్‌ వద్ద ఉన్న గేట్‌మ్యాన్ ఆ రైలులో మంటలు, పొగలు చూశాడు. వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్‌ చేశాడు. దీంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. తర్వాత రైల్వే స్టేషన్ చమ్రౌలాలో ఆ రైలును నిలిపి అందులోకి ఎక్కారు. రైలు కదులుతుండగా అన్ని బోగీలను తనిఖీ చేశారు. చివరకు జనరల్‌ బోగిలో పిడకలతో చలి మంట వేసినట్లు గుర్తించారు. వెంటనే ఆ మంటను ఆర్పివేశారు.

మరోవైపు ఆ రైలు అలీగఢ్‌ జంక్షన్‌ చేరిన వెంటనే జనరల్‌ బోగిలోని 16 మంది ప్రయాణికులను ఆర్పీఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. రైలు చలి మంట ఎవరు వేశారన్నదానిపై ఆరా తీశారు. ఈ పని తాము చేసినట్లు ఫరీదాబాద్‌కు చెందిన 23 ఏళ్ల చందన్, 23 ఏళ్ల దేవేంద్ర ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. మిగతా 14 మంది ప్రయాణికులను హెచ్చరించి వదిలేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement