Varalakshmi Vratham 2026: వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి? పూజా విధానం, నియమాలు, నైవేద్యం తెలుసుకోండి

శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటూ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. 2026లో వరలక్ష్మీ వ్రతాన్ని ఆగస్టు 21న నిర్వహించనున్నారు.

Varalakshmi-Vratam-Wishes

శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ 'వరలక్ష్మీ వ్రతం'. ముత్తైదువులు దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం, కుటుంబంలో అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పూజను ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. వ్రతం చేసుకునే రోజు ఉదయమే లేచి ఇల్లు పరిశుభ్రం చేసుకుని, గుమ్మానికి తోరణాలు, పూజ గదిలో ముగ్గులు వేసుకోవాలి.

శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటూ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. 2026లో వరలక్ష్మీ వ్రతాన్ని ఆగస్టు 21న నిర్వహించనున్నారు.

ఆగస్టు 20న ఈ రాశుల వారికి అదృష్టం.. ఊహించని ప్రయోజనాలు

ముఖ్యమైన సామాగ్రి:

అమ్మవారి కలశ చెంబు (వెండి/రాగి/పిత్తడి), కొబ్బరికాయ, బియ్యం, పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, తమలపాకులు, వక్కలు, కొత్త వస్త్రం (స చీర/రావి ఆకు రూపంలో), తోరాలు (నవగ్రంథి దారాలు), నైవేద్య పదార్థాలు.

2. కలశ స్థాపన:

పూజ పీఠంపై బియ్యం పిండితో పద్మం ముగ్గు వేసి, దానిపై కొద్దిగా బియ్యం పరచాలి.

బియ్యంపై కలశ పాత్రను ఉంచి, అందులో నీరు, కొద్దిగా పసుపు, అక్షతలు, ఒక నాణెం, సుగంధ ద్రవ్యాలు వేయాలి.

కలశం మూతిపై ఐదు తమలపాకులు లేదా మామిడి ఆకులను అమర్చి, పసుపు పూసిన కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయకు పసుపు, కుంకుమలు పెట్టి అమ్మవారి రూపంగా (లేదా లక్ష్మీదేవి ముఖపద్మాన్ని) అలంకరించాలి.

కొత్త వస్త్రం లేదా చిన్న చీరను అమ్మవారికి అలంకరించి, పూలతో సుందరంగా నిర్వహించాలి.

3. నవగ్రంథి తోరం (దారం) తయారీ:

వరలక్ష్మీ వ్రతంలో తోరానికి ప్రత్యేక స్థానం ఉంది. 9 దారాలు తీసుకుని, పసుపు పూసి, 9 ముడులు (గ్రంథులు) వేయాలి. ప్రతి ముడి వేసేటప్పుడు అమ్మవారి నామాలను స్మరిస్తూ పూలతో అలంకరించి పూజ పీఠం వద్ద ఉంచాలి.

4. పూజా విధానం:

గణపతి పూజ: ఏ పూజ అయినా విఘ్నేశ్వరుని ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. ముందుగా పసుపుతో వినాయకుడిని చేసి, ధ్యానం, ఆవాహన, శోడశోపచార పూజ చేసి నైవేద్యం సమర్పించాలి.

అంగపూజ & అష్టోత్తరం: ఆ తర్వాత వరలక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ధ్యాన శ్లోకాలు చదవాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళి (108 నామాలు) చదువుతూ రకరకాల పువ్వులు, అక్షతలతో పూజించాలి.

తోర పూజ: పూజించిన నవగ్రంథి తోరాన్ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించి, ఆ తర్వాత ముత్తైదువులు తమ కుడిచేతికి కట్టుకోవాలి.

5. నైవేద్యం & తోరధారణ:

అమ్మవారికి పరమాన్నం, పూర్ణం బూరెలు, పులిహోర, గారెలు, దద్దోజనం వంటి పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ధూపం, దీపం ఇచ్చి మహానైవేద్యం పెట్టి నీరాజనం (హారతి) ఇవ్వాలి.

6. వాయనం ఇవ్వడం:

పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులను (సుమంగళీలను) ఇంటికి పిలిచి, తాంబూలంలో పండ్లు, పసుపు-కుంకుమ, గాజులు, పువ్వులు, వాయనం ఫలాలతో పాటు వాయనం ఇవ్వాలి. ఇచ్చినదాననూ వాయనం.. పుచ్చుకున్నదాననూ వాయనం అని చెప్తూ ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకుని ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఇంట సకల సంపదలు, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement