Thyagaraja Swamy Aradhana 2025: త్యాగరాజ స్వామి ఆరాధన తేదీ, ప్రాముఖ్యత... వివరాలివే

త్యాగరాజ స్వామి ఆరాధన 2025కి సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు అంతటా ప్రతిష్టాత్మక సంగీత ఉత్సవం త్యాగరాజ ఆరాధన, తిరువాయూరులో ముగుస్తుంది.

Thyagaraja Swamy Aradhana 2025 Date, Significance.. Here are the details(X)

Tamilnadu, January 18:  త్యాగరాజ స్వామి ఆరాధన 2025కి సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు అంతటా ప్రతిష్టాత్మక సంగీత ఉత్సవం త్యాగరాజ ఆరాధన, తిరువాయూరులో ముగుస్తుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన సంగీతకారులు తమ కళలను ప్రదర్శించనున్నారు.

భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయాలలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు త్యాగరాజు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు త్యాగరాజు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనుకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.

ఈ ప్రతిష్టాత్మక సంగీత ఉత్సవం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడులలో జరుగుతుంది. ప్రధాన కార్యక్రమం తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని తిరువైయారులో జరుగుతుంది. ఏటా పుష్య బహుళ పంచమి రోజున ఆరాధన వేడుక జరుగుతుంది. జనవరి 29వ తేదీన మౌని అమావాస్య ఈరోజు కుంభమేళాలో స్నానం చేయడం ద్వారా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.. 

ఈ కార్యక్రమాన్ని శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ నిర్వహిస్తుంది. 1847లో త్యాగరాజు మరణించిన తరువాత, ఆయన శిష్యులు త్యాగరాజు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

త్యాగరాజ ఆరాధన సమయంలో భక్తులు మరియు సంగీతకారులు తిరువయ్యారులోని సాధువు సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. త్యాగరాజు ఆశీస్సులు కోరుతూ విగ్రహానికి పూలు, పండ్లు మరియు ఇతర నైవేద్యాలను సమర్పిస్తారు. తరువాత భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. చివరగా ఆరాధన ఉత్సవ హారతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement