Cough Syrup Quality Tests: భారత్‌ లో నాసిరకం దగ్గు మందులు.. నాణ్యత పరీక్షలో 100కు పైగా దగ్గు సిరప్‌ లు ఫెయిల్‌

భారత్ లో నాసిరకం దగ్గు మందులు తయారవుతున్నాయి. భారతీయ ఫార్మా కంపెనీలకు చెందిన 100కు పైగా దగ్గు సిరప్‌ లు నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ అయ్యాయి.

Cough Syrup (Photo-Twitter)

Newdelhi, July 26: భారత్ (India) లో నాసిరకం దగ్గు మందులు (Cough Syrup Quality Tests) తయారవుతున్నాయి. భారతీయ ఫార్మా కంపెనీలకు చెందిన 100కు పైగా దగ్గు సిరప్‌ లు నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ నివేదిక ఒకటి వెల్లడించింది. ఈ దగ్గు మందుల్లోని కొన్ని నమూనాల్లో  డైథిలిన్‌ గ్లైకాల్‌(డీఈజీ), ఇథిలిన్‌ గ్లైకాల్‌(ఈజీ) వంటి విష పదార్థాలు ఉన్నాయని పరీక్షల్లో తేలింది. డీఈజీ, ఈజీ, అస్సే, మైక్రోబియాల్‌ గ్రోత్‌, పీహెచ్‌, వాల్యూమ్‌ వంటి అంశాల కారణంగా ఆయా సిరప్‌ లకు సంబంధించిన 300 బ్యాచ్‌ లను నాణ్యతా ప్రమాణాలు లేని వాటిగా నివేదిక తేల్చింది.

భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యాన్ని తరిమికొట్టిన రోజు, కార్గిల్ విజయ్ దివస్ చరిత్ర ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందే

టెస్టులు చేయడానికి కారణం ఇదే..

ప్రపంచవ్యాప్తంగా 141 మంది చిన్నారుల ఆరోగ్య సమస్యలతో మరణించారు. అయితే, భారత్‌ లో ఉత్పత్తి అయిన దగ్గు మందులను వినియోగించడంతోనే వీళ్లు మరణించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌ లు దేశవ్యాప్తంగా ఈ మందులపై టెస్టింగ్‌ లు చేపట్టాయి.

విశ్వక్రీడా సంబరానికి వేళాయె.. పారిస్‌ కు వెళ్ళొద్దాం.. నేటి నుంచి ఒలింపిక్స్‌ మహోత్సవం.. 117 మందితో బరిలో భారత్‌.. రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ వేడుకలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement