Raids in Nizamabad: స్టార్ హోటల్స్ లో 122 కిలోల కుళ్లిన మాంసం.. ప్రమాదకరమైన రంగులు కలిపిన చికెన్.. నిజామాబాద్ లో ఘోరం (వీడియోతో)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమార్కులు ఆహార నాణ్యతకు తిలోదకాలు పెడుతున్నారు. ఆదివారం ఉదయం పట్టణంలోని లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Nizamabad, Oct 20: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో అక్రమార్కులు ఆహార నాణ్యతకు (Food Quality) తిలోదకాలు పెడుతున్నారు. ఆదివారం ఉదయం పట్టణంలోని లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లహరి హోటల్ లో 122 కిలోల కుళ్లిన మాంసం ఉత్పత్తులు, ప్రమాదకరమైన రంగులు కలిపిన చికెన్ ను అధికారులు గుర్తించారు. బూజు పట్టిన కూరగాయలు, ఫంగస్ చేరిన మిర్చి మసాల పెస్ట్ ల నిల్వలు కూడా లభించాయి.
ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు.. పోలీసులు అప్రమత్తం (వీడియోతో)
Here's Video:
హోటల్ లో 122 కిలోల కుళ్లిన మాంసం ఉత్పత్తులు, ప్రమాదకరమైన రంగులు కలిపిన చికెన్ గుర్తింపు.
నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని లాహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల తో స్టార్ హోటల్స్, ప్రముఖ హోటల్స్ , రెస్టారెంట్లో దాడులు… pic.twitter.com/DCaKHDlRJS
— ChotaNews (@ChotaNewsTelugu) October 20, 2024
మరో హోటల్ లో..
ఇక వంశీ హోటల్ లో రూ. 24 వేల విలువ చేసే హానికరమైన రంగులతో కూడిన మాంసపు ఉత్పత్తులు గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు హోటల్స్ కు నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటం అడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
(The above story first appeared on LatestLY on Oct 20, 2024 11:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

