Pink Power Run: పింక్ పవర్ రన్ ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ.. బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం (వీడియో)
ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముందస్తుగా ఈ కేసులను గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోవడంతో మరణాలు పెరిగిపోతున్నాయి.
Hyderabad, Sep 29: ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ (Breast cancer) కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముందస్తుగా ఈ కేసులను గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోవడంతో మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పింక్ పవర్ రన్ 2024 పేరిట (Pink Power Run) ఓ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి దీన్ని ప్రారంభించారు. సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ మారథాన్ ఆర్భాటంగా సాగింది. ఒకేసారి 3కే, 5కే, 10కే రన్ ను నిర్వహించారు. పింక్ మారథాన్ లో గెలిచినవారికి సీఎం రేవంత్ రెడ్డి మెడల్స్ పంపిణీ చేయనున్నారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కోసం
ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
రిపోర్టర్ ను చెట్టుకు కట్టేసిన ప్రజలు.. ఎందుకంటే? (వీడియోతో)