Allu Arjun: న్యూయార్క్ గడ్డపై అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం, ఇండియా డే పరేడ్‌కు నాయకత్వం వహించిన ఐకాన్ స్టార్, తగ్గేదేలే అంటూ డైలాగ్..

75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు అల్లు అర్జున్ నాయకత్వం వహించారు.

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం లభించింది. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు అల్లు అర్జున్ నాయకత్వం వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించింది.దీనికి గ్రాండ్ మార్షల్‌గా అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ సందర్బంగా ర్యాలీని ఉద్దేశించి అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. 'యే భారత్‌కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ..తగ్గేదేలే'.. అంటూ పుష్ప డైలాగ్‌తో ఉత్సాహపరిచాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement