Coronavirus in India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు, ఇందులో 15,044 కేసులు, గత 24 గంటల్లో 20 మంది మృతి

దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 15,044 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,24,323 మంది మరణించారు. ఇప్పటివరకు 4,25,92,455 మంది కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో 2641 మంది మహమ్మారినుంచి బయటపడగా, 20 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Coronavirus test (Photo-ANI)

దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 15,044 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,24,323 మంది మరణించారు. ఇప్పటివరకు 4,25,92,455 మంది కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో 2641 మంది మహమ్మారినుంచి బయటపడగా, 20 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతానికి చేరిందని, యాక్టివ్‌ కేసులు 0.04 శాతం ఉన్నాయని తెలిపింది. ఇక రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు 1,91,96,32,518 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒక్కరోజే 15,12,766 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement