Hindu Temple Vandalised: పాకిస్తాన్‌లో మళ్ళీ హిందూ ఆల‌యం ధ్వంసం, శ్రీ మారి మాతా మందిరంలోని విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన దుండగులు, ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు

పాకిస్థాన్‌లో హిందూ ఆల‌యాన్ని దుండగులు ధ్వంసం చేశారు. క‌రాచీలోని కోరాంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మారి మాతా మందిరంలోని విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు. కోరాంగి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Hindu temple vandalised in Pakistan's Karachi (Photo-Twitter)

పాకిస్థాన్‌లో హిందూ ఆల‌యాన్ని దుండగులు ధ్వంసం చేశారు. క‌రాచీలోని కోరాంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మారి మాతా మందిరంలోని విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు. కోరాంగి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఘ‌ట‌న గురించి తెలుస‌కున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. ఆల‌య ధ్వంసం ఘ‌ట‌న‌తో స్థానిక హిందువుల్లో భ‌యాందోళ‌న‌లు చెల‌రేగిన‌ట్లు ఓ ప‌త్రిక తెలిపింది. సుమారు 8 మంది బైక్‌ల‌పై వ‌చ్చి ఆల‌యంలోకి ప్ర‌వేశించి విగ్ర‌హాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు స్థానిక హిందూవు ఒక‌రు తెలిపారు. దాడికి దిగిన వారిపై కేసును బుక్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఇటీవ‌ల పాకిస్థాన్‌లో ఉన్న హిందువుల ఆల‌యాల‌పై దాడులు పెరిగాయి. ఇండ‌స్ న‌ది స‌మీపంలో ఉన్న ఓ చ‌రిత్రాత్మ‌క ఆల‌యాన్ని కూడా ఇటీవ‌ల ధ్వంసం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement