Covid in India: గుడ్ న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన మరణాల సంఖ్య, గత 24 గంటల్లో ఒకరు మృతి, కొత్తగా 1,247 మందికి కరోనా

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,247 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 43శాతం కేసులు తగ్గాయని పేర్కొంది. మరో మరణాలు సైతం భారీగా తగ్గాయి. కరోనాతో గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు.

Coronavirus Outbreak in China (Photo Credits: PTI)

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,247 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 43శాతం కేసులు తగ్గాయని పేర్కొంది. మరో మరణాలు సైతం భారీగా తగ్గాయి. కరోనాతో గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. తాజాగా 928 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజాగా కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,30,45,527కు పెరిగింది. ఇందులో 4,25,11,701 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 5,21,966 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.03శాతం ఉన్నాయని, ప్రస్తుతం రికవరీ రేటు 98.76శాతానికి పెరిగిందని పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement