Covid in India: దేశంలో తాజాగా 56,211 మందికి కరోనా నిర్ధారణ, 271 మంది మృతితో 1,62,114 కు పెరిగిన మరణాలు, దేశంలో ప్రస్తుతం 5,40,720 యాక్టివ్ కేసులు

దేశంలో గ‌త 24 గంటల్లో 56,211 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న‌ 37,028 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు (India Coronavirus) చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 271 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,114 కు పెరిగింది.

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,93,021 మంది కోలుకున్నారు. 5,40,720 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,11,13,354 మందికి వ్యాక్సిన్లు (Coronavirus Vaccine) వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,26,50,025 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,85,864 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

ఇండియా కోవిడ్ రిపోర్ట్ : 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement