Jammu and Kashmir: ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు, టెర్రరిస్టుని మట్టుబెట్టిన భారత బలగాలు, షోపియాన్‌ జిల్లాలో కొనసాగుతున్న గాలింపు చర్యలు

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (Encounter) ఓ టెర్రరిస్టుని భారత బలగాలు హతమార్చాయి. షోపియాన్‌లోని తుక్వాన్‌గామ్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కార్డన్‌ సెర్చ్‌నిర్వహించారు.

Representational Image (Photo Credits: PTI)

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (Encounter) ఓ టెర్రరిస్టుని భారత బలగాలు హతమార్చాయి. షోపియాన్‌లోని తుక్వాన్‌గామ్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కార్డన్‌ సెర్చ్‌నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. అయితే అతడు ఏగ్రూప్‌నకు చెందినవాడనే విషయం గుర్తించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని అధికారులు చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement