Lockdown in Tamil Nadu: తమిళనాడులో లాక్డౌన్, మే 10 నుంచి 24 వరకు లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు తెలిపిన స్టాలిన్ సర్కారు, మధ్యాహ్నం 12వరకు అత్యవసర సేవలకు అనుమతి
తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాక్డౌన్ మే 10 నుంచి అమల్లో ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల మే 10 నుంచి 2వారాలపాటు లాక్డౌన్ కొనసాగనుంది.
శుక్రవారం సీఎం స్టాలిన్ కలెక్టర్లతో కరోనాపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవటంతో ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది ఈ నెల 10న ఉదయం 4 గంటల నుంచి మే 24 తేది ఉదయం 4 గంటల వరకు తమిళానాడులో పూర్తి లాక్డౌన్ కొనసాగనుంది. మధ్యాహ్నం 12వరకు అత్యవసర సేవలకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. లాక్డౌన్లో బ్యాంకులు (50 శాతం సిబ్బందితో), రేషన్ షాపులకు అనుమతి ఉన్నట్లు తెలిపింది. రెస్టారెంట్లలో పార్సిల్ సౌకర్యం ఉంటుందని.. క్యాబ్లు, ఆటో సేవలు కేవలం ఆస్పత్రి, వివాహ, అంత్యక్రియకు మాత్రమే అనుమతిస్తున్నట్లు లాక్డౌన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement