Telangana: వీడియో ఇదిగో, మొసళ్లలోడుతో వెళ్తున్న లారీ బోల్తా, రోడ్డు పైకి మొసళ్లు రావడంతో భయంతో పరుగులు పెట్టిన స్థానికులు
నిర్మల్ జిల్లాలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మొసళ్లలోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టడంతో, మొసళ్లు రోడ్డుపై పడిపోయాయి. మామడ మండలంలోని మొండిగుట్ట సమీపంలో 44 జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
నిర్మల్ జిల్లాలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మొసళ్లలోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టడంతో, మొసళ్లు రోడ్డుపై పడిపోయాయి. మామడ మండలంలోని మొండిగుట్ట సమీపంలో 44 జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మామడ మండలంలో గురువారం ఉదయం 44 జాతీయ రహదారిపై ఒక లారీ బోల్తా కొట్టింది.
ఈ లారీ బీహార్ జిల్లా పాట్నాలోని సంజయ్ గాంధీ బయోలా జికల్ పార్కు నుంచి బెంగుళూరులోని బానర్ గట్స్ బయోలాజికల్ పార్కుకు ఎనిమిది మొసళ్లను తరలిస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది.లారీ బోల్తా కొట్టిన సమయంలో రెండు మొసళ్లు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు మొసళ్ల సంరక్షణ చర్యలు చేపట్టారు.డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
lorry loaded with crocodiles overturned