Chhattisgarh: షాకింగ్ వీడియో, మద్యం మనుషులను ఒకటి చేస్తుంది, కాబట్టి అందరూ కొద్ది మోతాదులో తీసుకోవాలని ఛత్తీస్‌గఢ్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

డి-అడిక్షన్‌ కార్యక్రమం వేదికగా ఛత్తీస్‌గఢ్‌ పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రేమ్‌సాయి సింగ్‌ టెకమ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ ప్రజలను ఏకం చేస్తుందని, అయితే, కొద్ది మోతాదులో తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Premsai Singh Tekam (Photo-Twitter)

డి-అడిక్షన్‌ కార్యక్రమం వేదికగా ఛత్తీస్‌గఢ్‌ పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రేమ్‌సాయి సింగ్‌ టెకమ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ ప్రజలను ఏకం చేస్తుందని, అయితే, కొద్ది మోతాదులో తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లిక్కర్‌పై రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే అజయ్‌ చంద్రాకర్‌ తీవ్రంగా తప్పుట్టారు . ‘భూపేశ్‌ బఘేల్‌ జీ ప్రభుత్వం, పార్టీ కార్టూన్లతో నిండిపోయింది. ఏఒక్కరికి విషయం అర్థంకాదు. ఇది పని చేసే ప్రభుత్వం కాదు అని ఆరోపించారు. మరోవైపు.. కొద్ది రోజుల క్రితం భంగ్‌, గంజాయిని లిక్కర్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించాలని బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధి వ్యాఖ్యానించిన తర్వాత రాష్ట్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన‍్యం సంతరించుకుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement