Gwalior Shocker: దారుణం, పెళ్లికి ఒప్పుకోలేదని కూతురిని పోలీసుల ఎదుటే కాల్చి చంపిన తండ్రి, ప్రేమించిన ప్రియుడినే చేసుకుంటానని కూతురు చెప్పడంతో కోపం పట్టలేక..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తను గుర్జార్ అనే 20 ఏళ్ల యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు, నిశ్చితార్థం చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకించడంతో ఆమె తండ్రి మహేష్ గుర్జార్ ఆమెను కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.

Crime | Representative Image (Photo Credit: Pixabay)

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తను గుర్జార్ అనే 20 ఏళ్ల యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు, నిశ్చితార్థం చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకించడంతో ఆమె తండ్రి మహేష్ గుర్జార్ ఆమెను కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. తన కుటుంబసభ్యులు తనను పెళ్లికి బలవంతం చేశారని, తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ తనూ అనే యువతి అదేరోజు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

ఆమె తన భాగస్వామి భికం "విక్కీ" మావాయిని వివాహం చేసుకోవాలనే తన కోరికను వీడియోలో వ్యక్తం చేసింది, అతనితో ఆమె ఆరు సంవత్సరాల నుండి సంబంధం కలిగి ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీసుల మధ్యవర్తిత్వంలో తండ్రి మహేష్ తన కూతురు తనూతో ఏకాంతంగా మాట్లాడాలని అభ్యర్థించాడు.

వీడియో ఇదిగో, నార్సింగి అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై పై జంట హత్యలు, కత్తితో పొడిచి అనంతరం బండ రాళ్లతో మోది దారుణంగా..

పోలీసులు అందుకు అంగీకరించడంతో ఏకాంతంగా మాట్లాతుండగానే తండ్రి ఆమెను చాలా దగ్గరి నుండి కాల్చాడు. ఆమె బంధువు రాహుల్ సహాయంతో అనేక సార్లు కాల్చాడు. దీంతో తనూ అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి మహేశ్‌ను అరెస్టు చేసి కాల్చిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంధువు రాహుల్ పరారీలో ఉన్నాడు. ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు తనూ యొక్క సోషల్ మీడియా ఖాతాలను సమీక్షిస్తున్నారు.

Madhya Pradesh Father Kills Daughter in Front of Cops 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement