Air India Row: వెజ్ ఆర్డర్ ఇస్తే ప్యాకెట్‌ లో నీసు ముక్కలు .. ఎయిర్ ఇండియా విమానంలో మహిళకు చేదు అనుభవం

కాలికట్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలు వీరాజైన్‌ కు చేదు అనుభవం ఎదురైంది. శాకాహార భోజనం అడిగిన ఆమెకు విమాన సిబ్బంది అదే ఇచ్చినా.. అందులో చికెన్ ముక్కలు ఉండడంతో ఆమె అవాక్కైంది.

Air India Row (Credits: X)

Newdelhi, Jan 12: కాలికట్ (Calicut) నుంచి ముంబై (Mumbai) వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో మహిళా ప్రయాణికురాలు వీరాజైన్‌ కు చేదు అనుభవం ఎదురైంది. శాకాహార భోజనం అడిగిన ఆమెకు విమాన సిబ్బంది అదే ఇచ్చినా.. అందులో చికెన్ ముక్కలు ఉండడంతో ఆమె అవాక్కైంది. అంతేకాదు, వారు సర్వ్ చేసిన ఆహార పొట్లంపై ‘వెజ్ మీల్’ అని స్పష్టంగా రాసివుంది కూడా. దీంతో వెంటనే ఆమె ఆ ఫొటోలు తీసి సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో షేర్ చేసింది. ఆమె పోస్టు వైరల్ అయి చర్చనీయాంశం కావడంతో స్పందించిన ఎయిర్ ఇండియా.. ఆ పోస్టును డిలీట్ చేయాలని, ఇలాంటి సున్నిత విషయాలను బహిరంగ పర్చవద్దని కోరింది. పీఎన్ఆర్ నంబర్‌ తో తమకు నేరుగా మెసేజ్ (డీఎం) చేయాలని అభ్యర్థించింది. ఎయిర్ ఇండియా కోరినట్టే డైరెక్ట్ మెసేజ్ చేసినప్పటికీ వారి స్పందన చాలా నాసిరకంగా ఉందని జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కేవలం క్షమాపణలు చెప్పి ఆ విషయాన్ని అక్కడితో ముగించారని పేర్కొన్నారు.

Amazon Layoffs: కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత.. 5 శాతం టెక్‌ ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైన అమెజాన్ ఆడిబుల్ డివిజన్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement