BGMI Re-launch in India: గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్, షూటింగ్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా మరోసారి భారత్లోకి రీ ఎంట్రీ
గేమింగ్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ మల్టీప్లేయర్ షూటింగ్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) మరోసారి భారత్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది.ఈ గేమ్ గతేడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గేమ్ కార్యకలాపాలను పునః ప్రారంభించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.
గేమింగ్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ మల్టీప్లేయర్ షూటింగ్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) మరోసారి భారత్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది.ఈ గేమ్ గతేడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గేమ్ కార్యకలాపాలను పునః ప్రారంభించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతానికి మూడు నెలల ట్రయల్కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
గేమింగ్ కంపెనీ సర్వర్ లొకేషన్లు, డేటా భద్రతకు సంబంధించి నిబంధనలు పాటించినందున మూడు నెలల ట్రయల్కు మాత్రమే అనుమతిస్తున్నట్లు రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం ట్వీట్ చేశారు.యూజర్లపై ప్రభావం, ఎడిక్షన్ వంటి అంశాలను పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.సరిహద్దుల్లో ఘర్షణ సమయంలో చైనాకు చెందిన టెన్సెంట్తో క్రాఫ్టన్కు సంబంధాలు ఉన్నాయంటూ బీజీఎంఐపై కేంద్రం నిషేధం విధించింది. నిషేధం నాటికి ఈ గేమ్కు 100 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి.
Here's IANS Tweet