టీంమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. తనపై జరిగిన హత్యాయత్నాన్ని, ఒళ్లు గగుర్పొడిచే ఘటన గురించి వెల్లడించాడు. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో ‘ఆ తాగుబోతు ఆటగాడు’ తథేకంగా తనవైపే చూశాడని, తనను రమ్మని పిలిచి హోటల్ 15వ అంతస్తు నుంచి తనను వేలాడేశాడని చెప్పాడు. చంపినంత పనిచేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.నేను 2013లో ముంబై తరఫున ఆడుతున్నాను. బెంగళూరులో మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అయ్యాక గెట్ టు గెదర్ పార్టీ జరిగింది.

అక్కడ ఓ ఆటగాడు బాగా తాగి ఉన్నాడు. అతడి పేరు నేను చెప్పదలచుకోలేదు. ఆ తాగుబోతు ఆటగాడు నన్ను పిలిచి బయటకు తీసుకెళ్లాడు. నన్ను ఎత్తుకుని 15వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడదీశాడు. నాకు ఒక్కసారిగా భయమేసింది. అతడి మెడ చుట్టూ నేను చేతులు బిగించి పట్టుకున్నాను. చేతులు జారాయా.. నేను చచ్చినట్టే. దీంతో అక్కడున్న ఇతర ఆటగాళ్లు వచ్చి నన్ను పైకి లాగారు. కళ్లు తిరిగి పడిపోయిన నాకు కొన్ని నీళ్లిచ్చారు. దీంతో కొద్దిలో చావును తప్పించుకున్నాను. ఆటగాళ్లు నన్ను రూమ్ కు తీసుకెళ్లారు’’ అని చాహల్ వివరించాడు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)