Gangavaram Port: అదానీ సెజ్‌లో విలీనమైన విశాఖ గంగవరం పోర్టు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, పోర్టును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్న ఏపీసెజ్

విశాఖ గంగవరం పోర్టు లిమిటెడ్‌ను(GPL) అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్‌ లిమిటెడ్(APSEZ)లో విలీనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విలీన ప్రక్రియకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Gangavaram port limited (Photo-Wikimedia Commons)

Visakhapatnam, May 26: విశాఖ గంగవరం పోర్టు లిమిటెడ్‌ను(GPL) అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్‌ లిమిటెడ్(APSEZ)లో విలీనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విలీన ప్రక్రియకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గంగవరం పోర్టును (Gangavaram Port) డీవీఎస్ రాజు కన్సార్టియం అభివృద్ధి చేసింది. ఇందులో డీవీఎస్ రాజుకు 58.10 శాతం, విండీ లేక్ ‌సైడ్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్‌కు 31.5 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాలు ఉన్నాయి.

రాజు, విండీ లేక్ సైడ్ వాటాలను అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ సెజ్) కొనుగోలు చేసింది. మిగిలిన ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేసి పోర్టును (Gangavaram port limited) పూర్తిగా సొంతం చేసుకునేందుకు ఏపీ సెజ్ ప్రతిపాదించింది. స్పందించిన ప్రభుత్వం వాటాల విక్రయానికి సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు కార్యదర్శులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, పోర్టును ఏపీ సెజ్‌లో విలీనానికి కూడా అనుమతి నిచ్చింది.

కాగా రాజు, విండీ లేక్ సైడ్ వాటాలను అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ సెజ్) కొనుగోలు చేసింది. డీవీఎస్ రాజుకు కన్సార్టియంకు చెందిన వాటాను రూ.3604 కోట్లకు,విండీ లేక్ సైడ్ వాటాను రూ.1954 కోట్లకు అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. మిగిలిన ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేసి పోర్టును పూర్తిగా తమ ఆధీనం చేసుకోవాలని ఏపీసెజ్ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా అటువైపు నుంచి సానుకూల స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది.

అన్నీ అనుకూలిస్తే ఆనందయ్య కరోనా మందు టీటీడీ ఉత్పత్తి చేసే అవకాశం, నేడు సీసీఆర్‌ఏఎస్‌కు నివేదిక సమర్పించనున్న తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ

ప్రభుత్వ వాటాల విక్రయానికి సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు కార్యదర్శులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని తాజా ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ పోర్ట్ డెవలపర్,ఆపరేటర్‌గా ఉన్న అదానీ గ్రూప్... గంగవరం పోర్టు కొనుగోలు ద్వారా పాన్-ఇండియాలో తమ కార్గో ఉనికిని మరింత విస్తరించనుంది. గంగవరం పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. ఏ సీజన్‌లోనైనా ఇక్కడినుంచి సరకు రవాణాకు అవకాశం ఉంటుంది. బాగా లోతైన పోర్టు కావటంతో 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం గల సూపర్‌ కేప్‌ సైజ్‌ ఓడలు కూడా ఇక్క‌డికి వచ్చి వెళ్ల‌గ‌లవు. దాదాపు 1800 ఎకరాల విస్తీర్ణంలోని గంగవరం పోర్టులో మొత్తం 9 బెర్తులు ఉన్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్‌, పంచదార, అల్యూమినియం, ఉక్కు ఎగుమతులు/ దిగుమతులు ఇక్కడినుంచి పెద్దఎత్తున సాగుతున్నాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Mamunoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం

Hindi Language Row in Tamil Nadu: వీడియో ఇదిగో, తమిళనాడులో బోర్డుల మీద హిందీ అక్షరాలను చెరిపేస్తున్న డీఎంకే కార్యకర్తలు, కొత్త విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం

YS Avinash Reddy: సూపర్ సిక్స్ రెఫరెండంతో మంగళగిరి, పిఠాపురంలో గెలిచే దమ్ముందా, ఎన్నికలకు సిద్ధమని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి

Advertisement
Advertisement
Share Now
Advertisement