Covid in AP: ఏపీలో ఒక్కరోజే 24,105 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, తాజాగా 18,285 మంది కోవిడ్, 99 మంది మృత్యువాత, గత24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు, మరణాల లిస్ట్ ఇదే..
ఆంధ్రప్రదేశ్లో తాజాగా 18వేలకు పైగా కరోనా కేసులు (Covid in AP) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,120 శాంపిల్స్ను పరీక్షించగా, 18,285 మంది కరోనా (AP Logs 18,285 New Cases) బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్లో తెలిపింది. అదే సమయంలో 24,105 కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,24,859కి చేరింది.
Amaravati, May 26: ఆంధ్రప్రదేశ్లో తాజాగా 18వేలకు పైగా కరోనా కేసులు (Covid in AP) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,120 శాంపిల్స్ను పరీక్షించగా, 18,285 మంది కరోనా (AP Logs 18,285 New Cases) బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్లో తెలిపింది. అదే సమయంలో 24,105 కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,24,859కి చేరింది.
గడిచిన 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 99 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మృతి చెందగా, పశ్చిమగోదావరి 14, విజయనగరం 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, నెల్లూరు 8, ప్రకాశం 8, విశాఖపట్నం 8, కర్నూలు 6, గుంటూరు 5, కృష్ణా 5, శ్రీకాకుళంలో ఐదుగురు చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో బాధపడుతూ ఇప్పటివరకూ 10,427మంది మృతి చెందారు.
Here's AP Covid Report
గత 24 గంటల్లో అనంతపురంలో 1876 కేసులు, చిత్తూరులో 1822, ఈస్ట్ గోదావరిలో 3296, గుంటూరులో 1211, కడపలో 877, కృష్ణాలో 652, కర్నూలులో 1026, నెల్లూరులో 1159, ప్రకాశంలో 1056, శ్రీకాకుళంలొ 1207, విశాఖపట్నంలో 1800, విజయనగరంలో 639, వెస్ట్ గోదావరిలో 1644 కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన కేసులు
అనంతపురం: 132651
చిత్తూరు: 180422
ఈస్ట్ గోదావరి : 214467
గుంటూరు : 145713
కడప : 91723
కృష్ణా: 84917
కర్నూలు: 11247
నెల్లూరు: 114095
ప్రకాశం : 103119
శ్రీకాకుళం: 105888
విశాఖపట్నం: 131984
విజయనగరం: 72206
వెస్ట్ గోదావరి : 136 063