IAS Officials' Reshuffle: రాత్రికి రాత్రే 60 మందికి పైగా ఉన్నతాధికారులకు స్థానచలనం, 50 మంది ఐఏఎస్‌లకు కొత్త శాఖలు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఉన్న రజత్ కుమార్ (Rajath Kumar) ను నీటి పారుదల మరియు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్‌కు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్న అధర్ సిన్హాను పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీగా నియమించారు.....

Govt of Telangana | File Photo

Hyderabad, February 03:  రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్ ఆఫీసర్ల (IAS Officials) స్థానచలనం జరిగింది. వివిధ శాఖలల్లోని ప్రధాన అధికారులను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పునర్వ్యవస్థీకరించింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మొత్తం 65 మంది ఉన్నతాధికారులు ఒకేసారి బదిలీ చేయబడ్డారు. ఈ ప్రక్రియలో 51 మంది ఐఏఎస్‌లకు కొత్త పోస్టింగ్‌లు ఇవ్వబడ్డాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఉన్న రజత్ కుమార్ (Rajath Kumar) ను నీటి పారుదల మరియు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్‌కు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్న అధర్ సిన్హాను పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీగా నియమించారు. ఇక ఈయన స్థానంలోకి పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్‌కు పోస్టింగ్ ఇచ్చారు. మరో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ర్యాంక్‌లో ఉన్న శ్రీమతి చిత్ర రామచంద్రన్ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు.

బి. వెంకటేషం బిసి సంక్షేమ శాఖ కమిషనర్‌గా, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైనాన్స్ సెక్రెటరీగా ఉండే సందీప్ కుమార్ సుల్తానియాను పంచాయతీ రాజ్ విభాగం కార్యదర్శిగా వికాస్ రాజ్ స్థానంలో నియమించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా ఉన్న టి. కె. శ్రీదేవిని బదిలీ చేసి ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించారు మరియు ఆమె స్థానంలో కామారెడ్డి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ నియమింపబడ్డారు.

హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కె. మాణిక్‌రాజ్‌ను పరిశ్రమల కమిషనర్‌గా, మహబూబ్‌నగర్ కలెక్టర్ డి. రోనాల్డ్ రోజ్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించారు. సీనియర్ ఐఎఎస్ అధికారి రాహుల్ బోజ్జాను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమించారు.

భద్రాద్రి కొఠాగుడెం కలెక్టర్ రజత్ కుమార్ సైనీని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ డైరెక్టర్‌గా నియమించారు. వీరితో పాటు పలు జిల్లా కలెక్టర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.

సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (CS)గా సోమేష్ కుమార్ (Somesh Kumar)ను నియమించిన నేపథ్యంలో పాలన యంత్రాంగంలోని ఉన్నతాధికారులంతా ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమేశ్ కుమార్ కంటే సీనియారిటీ గల ఐఏఎస్ ఆఫీసర్లు దీని నుంచి మినహాయింపు కోరుకున్నారు. ఈ నేపథ్యంలో శాఖల మార్పు అనివార్యమైనట్లు తెలుస్తుంది.

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement