Viral Pic: ఒకే ఫొటో ఫ్రేం లో బండి సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి.. రాజకీయాలను పక్కనపెట్టి సన్నిహితుడి పాడె మోసిన నేతలు

మానవీయత, ఆత్మీయత, భావోద్వేగాల ముందు రాజకీయ కక్షలు, కోపాలు ఏమాత్రం పనిచేయవని మరోసారి రుజువైంది. అకాల మరణం చెందిన సన్నిహితుడి అంత్యక్రియలకు హాజరైన బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కలిసి పాడెమోశారు.

Credits: Twitter

Huzurabad, July 8: మానవీయత, ఆత్మీయత, భావోద్వేగాల ముందు రాజకీయ కక్షలు, కోపాలు ఏమాత్రం పనిచేయవని మరోసారి రుజువైంది. అకాల మరణం చెందిన సన్నిహితుడి అంత్యక్రియలకు హాజరైన బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) కలిసి పాడెమోశారు. హుజూరాబాద్‌లో (Huzurabad) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

PM Modi Warangal Tour: ఓరుగల్లుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ.. భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. బహిరంగ సభలో ప్రసంగం.. మొత్తం టూర్ షెడ్యూల్ ఇలా..

అసలేం జరిగిందంటే??

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్ఎస్ నాయకుడు నందగిరి మహేందర్‌రెడ్డి అంత్యక్రియలు నిన్న నిర్వహించారు. బీఆర్ఎస్‌లో చేరకముందు ఆయన రెండు దశాబ్దాలపాటు ఏబీవీపీ, బీజేపీలో పనిచేశారు. బండి సంజయ్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. 2021 హుజారాబాబ్ ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కౌశిక్‌రెడ్డితో సాన్నిహిత్యం పెరిగింది. నిన్న ఆయన అంత్యక్రియలకు సంజయ్, కౌశిక్ వేర్వేరుగా హాజరైనప్పటికీ ఇద్దరూ కలిసి పాడెమోశారు.

PM Modi in Varanasi: ఒక కుటుంబం కోసం కాదు, భవిష్యత్ తరాల బాగు కోసమే పథకాలు తీసుకొచ్చాం, వారణాసిలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement