Revanth Reddy House Arrest: రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు హౌస్ అరెస్ట్, పెట్రోల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా, రాష్ట్రంలో ఈ నెల నుంచి విద్యుత్‌ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళనలకు ప్లాన్‌ చేశారు.

Revanth Reddy escapes house arrest to participate in protest for reducing electricity price (Photo-Twitter)

Hyd, April 7: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా, రాష్ట్రంలో ఈ నెల నుంచి విద్యుత్‌ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళనలకు ప్లాన్‌ చేశారు. అందులో భాగంగా గురువారం.. విద్యుత్‌ సౌధ, సివిల్‌ సప్లై కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని కాం‍గ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీఎ‍ల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆపై హౌస్‌ అరెస్ట్‌ నుంచి బయటకు వచ్చిన వీరు విద్యుత్‌ సౌధ గేటు బయట నిరసన తెలిపారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో నేతల్ని మాత్రమే లోపలికి అనుమతించగా, కాంగ్రెస్‌ కార్యకర్తలు గేటు బయట ఆందోళనకు దిగారు.

రెండు సంవత్సరాల తరువాత శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన భద్రాచలం, ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న మహాపట్టాభిషేకం కార్యక్రమాలు

విద్యుత్ సౌధ దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. విద్యుత్ సౌధ ముందు కాంగ్రెస్‌ నేతలు భైఠాయించారు. 10 మంది కాంగ్రెస్‌ నేతలు లోపలికి వెళ్లేందుకు పోలీసుల అనుమతి ఇచ్చారు. దాంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు విద్యుత్ సౌధ ముందు బైఠాయించారు. పోలీసులకు, కాంగ్రెస్‌ నేతలకు తోపులాట జరగడంతో కాంగ్రెస్‌ నాయకురాలు విద్యారెడ్డి కిందపడిపోయింది. దాంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమెను నిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతలు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement