Telangana Shocker: భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న జడ్జి, కుటుంబ కలహాలే కారణమని తేల్చిన పోలీసులు, హైదరాబాద్‌లో విషాదకర ఘటన

జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదివారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 36 ఏళ్ల, ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (JFCM), చిన్న సమస్యపై తన భార్యతో "వాదన" కారణంగా కలత చెంది, తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా తెలిపారు.

Representational Image (File Photo)

Hyderabad, March 24: జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదివారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 36 ఏళ్ల, ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (JFCM), చిన్న సమస్యపై తన భార్యతో "వాదన" కారణంగా కలత చెంది, తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా తెలిపారు. అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ కథనం ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ముచ్చువెల్లికి చెందిన ఎ.మణికంఠ (36) 2016లో జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో స్పెషల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ (ఎక్సైజ్‌)గా ఉన్నారు. ఆయనకు ఏడేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలానికి చెందిన లలితతో వివాహమైంది. వారికి ఐదేళ్ల బాబు ఉన్నాడు. బాగ్‌ అంబర్‌పేట పోచమ్మబస్తీలో నివసిస్తున్నారు.  వీధిలో నడుస్తూ గుండె పట్టుకుని కుప్పకూలిన బాటసారి, షాకింగ్ సీసీ పుటేజీ వీడియో ఇదిగో..

కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో ఇటీవల ఆమె కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. మరోవైపు మణికంఠ తల్లి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ.. మణికంఠ ఫోన్‌ పెట్టేశారు. అనంతరం పడక గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తండ్రి శ్రీశైలం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement