Telangana Shocker: రాత్రి పూట ఒంటరిగా బార్ పక్కన నిల్చున్న మతి స్థిమితం లేని మహిళ, బార్ వెనక్కి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్లు

భాగ్య నగరంలో దారుణం చోటు (Telangana Shocker) చేసుకుంది. ఒంటరిగా ఉన్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది.

Representative image

Hyd, May 2: భాగ్య నగరంలో దారుణం చోటు (Telangana Shocker) చేసుకుంది. ఒంటరిగా ఉన్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. దుండిగల్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన మానసిక స్థితి సరిగా లేని 30 ఏళ్ల రెండ్రోజుల క్రితం నగరానికి వచ్చింది. శక్రవారం రాత్రి గండిమైసమ్మ నుంచి దుండిగల్‌కు వెళ్లే రోడ్డులోని ఉజ్వల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పక్కన సదరు మహిళ ఒంటరిగా నిలుచుని ఉంది. దుబాయ్‌లో డబ్బు కోసం కుక్కలతో శృంగారం చేస్తున్న మహిళలు, సెక్స్ కోసం వారానికి రూ. 20 వేలు ఒప్పందం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్

ఈ క్రమంలో ఐదుగురు యువకులు ఆమెను ఉజ్వల బార్‌ వెనుక ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక ఆత్యాచారానికి (Mentally Challenged Woman Gang-Raped) పాల్పడ్డారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఇమ్రాన్‌(20)ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. మరికొందరు నిందితులు నర్సింహ, ఖుద్దూస్, ఉమిద్దీన్, ఇమామ్‌లు పరారీలో ఉన్నారు. కాగా నిందితులంతా డి.పోచంపల్లి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లుగా తేలింది. వారిపై 377డీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement