Tap to Pay: గూగుల్‌ పే యూజర్లకు శభవార్త, లావాదేవీలు మరింత సులువుగా జరిపేందుకు ట్యాప్‌ టూ పే, పైన్ ల్యాబ్స్‌తో జతకట్టిన గూగుల్‌ పే

ప్రముఖ ఆన్‌లైన్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాం గూగుల్‌ పే (Google Pay) యూజర్లకు శభవార్తను అందించింది. మరింత సులువుగా లావాదేవీలను జరిపేందుకుగాను ‘ట్యాప్‌ టూ పే’ సేవలను (Tap to Pay for UPI) యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

ప్రముఖ ఆన్‌లైన్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాం గూగుల్‌ పే (Google Pay) యూజర్లకు శభవార్తను అందించింది. మరింత సులువుగా లావాదేవీలను జరిపేందుకుగాను ‘ట్యాప్‌ టూ పే’ సేవలను (Tap to Pay for UPI) యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ సేవల్లో భాగంగా 'ట్యాప్ టు పే' ఫీచర్‌ కోసం ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పైన్ ల్యాబ్స్‌తో గూగుల్‌ పే జతకట్టింది. దీంతో యూజర్లు తమ కార్డ్‌లను ఉపయోగించకుండా యూపీఐ ద్వారా సజావుగా చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది.

ఈ ఫీచర్ కేవలం డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. పైన్ ల్యాబ్స్ రూపొందించిన ఆండ్రాయిడ్ పీఓఎస్‌ టెర్మినల్‌ని ఉపయోగించి లావాదేవీలను గూగుల్‌ పే యూజర్లు చేయవచ్చును. నీయర్‌ టూ ఫీల్డ్‌(ఎన్‌ఎఫ్‌సీ) పేమెంట్స్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉండే అన్ని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండనుంది. ఈ ఫీచర్‌ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్‌, స్టార్‌బక్స్, ఫ్యూచర్ రిటైల్ వంటి ఇతర పెద్ద వ్యాపారులకు అందుబాటులోకి వచ్చింది.

భారత్ నుంచి వెళ్లిపోయిన ఈ కామర్స్ దిగ్గజం షాపీ, ట్విట్టర్లో కౌంటర్ విసిరిన స్వదేశీ ఈ కామర్స్ దిగ్గజం మీషో

ట్యాప్‌ టూ పే ఫీచర్‌తో యూపీఐ పేమెంట్స్‌ మరింత తక్కువ సమయంలో జరుగుతాయని గూగుల్‌ పే బిజినెస్‌ హెడ్‌ సశిత్‌ శివానందన్‌ అన్నారు. అంతేకాకుండా అవుట్‌లెట్లలో, క్యూ మేనేజ్‌మెంట్ అవాంతరాలు చాలా వరకు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. గూగుల్‌ పేతో భాగస్వామిగా పైన్‌ ల్యాబ్స్‌ ఉన్నందుకు సంతోషిస్తున్నామని పైన్‌ ల్యాబ్స్‌ బిజినెస్‌ చీఫ్‌ ఖుష్‌ మెహ్రా అన్నారు. భారత్‌లో కాంటక్ట్‌లెస్‌ పేమెంట్స్‌ను అందించేందుకు పైన్‌ ల్యాబ్స్‌ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement