Next Pandemic 'Absolutely Inevitable': కరోనా సంక్షోభం మరచిపోకముందే ప్రపంచంపై మరో పిడుగు, మరో ముప్పు పొంచి ఉందని హెచ్చరించిన బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్

కరోనా స‌ృష్టించిన సంక్షోభం నుంచి ప్రపంచం ఇంకా బయటపడకముందే మరో పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. కరోనా తరహా మరో సంక్షోభాన్ని మానవాళి మళ్లీ ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపు నిచ్చారు

Virus (Image Credits: Pixabay)

కరోనా స‌ృష్టించిన సంక్షోభం నుంచి ప్రపంచం ఇంకా బయటపడకముందే మరో పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. కరోనా తరహా మరో సంక్షోభాన్ని మానవాళి మళ్లీ ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపు నిచ్చారు. సంక్షోభ నివారణ ఏర్పాట్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ దిశగా కీలక అంశాలపై తక్షణం దృష్టి పెట్టాలన్నారు. 2021లో కరోనా సందర్భంగా తాను చేసిన సూచనలన్నీ 2023 కల్లా అనేక దేశాల ప్రభుత్వాలు మర్చిపోయాయన్నారు. ఇది ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. కరోనా కారణంగా తగ్గిన మనిషి ఆయుష్షు కాలం, ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపిన డబ్ల్యూహెచ్ వో

రాబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు పటిష్ఠ నిఘా వ్యవస్థ ఉండాలన్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు తక్షణం స్పందించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. తగిన స్థాయిలో వైద్య పరీక్షల నిర్వహణ సామర్థ్యం, టీకాలు, చికిత్సలు అన్నీ అందుబాటులో ఉంటే లాక్ డౌన్, భౌతిక దూరం వంటి కఠిన చర్యల అవసరం ఉండదని అన్నారు. సంక్షోభ సమయంలో వివిధ దేశాలు కలిసికట్టు చర్యలు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement