Pakistan PM Imran Khan: వాళ్ల పొట్టి దుస్తులు వల్లే మగాళ్లలో కోరికలు పెరిగిపోతున్నాయి, అందుకే అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి, సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

మహిళల వస్త్రధారణపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్ల్రీలు ధరించే దుస్తుల వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. మహిళలు తమ వస్త్రధారణతో మగవారి మనసు చెదిరేలా చేస్తున్నారని.. ఫలితంగా మగవారిలో కోరికలు రేగి ('If You Raise Temptation) అత్యాచార కేసులు పెరుగుతున్నాయంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ (Prime Minister Imran Khan) ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Pakistan PM Imran Khan. (Photo Credits: Social Media)

Karachi, June 22: మహిళల వస్త్రధారణపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్ల్రీలు ధరించే దుస్తుల వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. మహిళలు తమ వస్త్రధారణతో మగవారి మనసు చెదిరేలా చేస్తున్నారని.. ఫలితంగా మగవారిలో కోరికలు రేగి ('If You Raise Temptation) అత్యాచార కేసులు పెరుగుతున్నాయంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ (Prime Minister Imran Khan) ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

మహిళలు పొట్టి దుస్తులు ధరిస్తే.. మగవారిపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. స్త్రీలు తమ శరీరం కనిపించేలా దుస్తులు ధరిస్తే మగవారి మనస్సు చలిస్తుంది. పురుషులు రోబోలు అయితే తప్ప.. వారు చలించకుండా ఉండరు. ఎందుకంటే మనం నివసిస్తున్న సమాజం పూర్తిగా భిన్నమైంది. ఇక్కడ ఎలా నడుచుకోవాలనే ఇంగిత జ్ఞానం మనకే ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.

దేశంలో (Pakistan) పెరిగిపోతున్న అఘాయిత్యాలను మహిళల వస్త్రధారణతో ఇమ్రాన్ మరోసారి ముడిపెట్టడం చాలా దారుణం అని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ లీగల్ అడ్వైజర్ రీమా ఒమర్ అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని ఇమ్రాన్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే అధికార ప్రతినిధి డాక్టర్ అర్ స్లాన్ ఖాలిద్ అన్నారు. ఇమ్రాన్‌ అన్నదానిని పూర్తిగా చెప్పకుండా కేవలం ఒక వాక్యాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో.. లైంగిక వాంఛలు ఏ స్థాయికి వెళ్లాయో ప్రధాని చెప్పారన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లోనూ ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి అభాసుపాలయిన సంగతి తెలిసిందే.

ఆ వ్యాపారవేత్త నాపై అత్యాచారం చేసి చంపేయడానికి ప్రయత్నించాడు, కాపాడాలంటూ ప్రధానిని సోషల్ మీడియా ద్వారా అర్థించిన బంగ్లాదేశ్‌ హీరోయిన్‌ పోరి మోని, నిందితుడు నజీర్‌ యు మహ్మూద్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మ‌రోసారి క‌శ్మీర్ స‌మ‌స్య‌పై స్పందించారు. ఒక‌సారి క‌శ్మీర్ స‌మ‌స్య ప‌రిష్కార‌మైతే, అప్పుడు రెండు దేశాలు అణ్వాయుధాల‌ను పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. హెచ్‌బీవో జ‌ర్న‌లిస్టు జోనాథ‌న్ స్వాన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ స‌మాధానం వెల్ల‌డించారు. పాకిస్థాన్‌లో అత్యంత వేగంగా అణ్వాయుధాల‌ను స‌మీక‌రిస్తున్న‌ట్లు ఇంటెలిజెన్స్ నివేదిక‌లు చెబుతున్నాయ‌ని, ఎందుకు అలా జ‌రుగుతున్న‌ట్లు ఆ జ‌ర్న‌లిస్టు పాక్ ప్ర‌ధానిని ప్ర‌శ్నించారు.

ఆ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ ఇంటెలిజెన్స్‌కు ఎక్క‌డ నుంచి స‌మాచారం వ‌స్తుందో త‌న‌కు తెలియ‌ద‌ని, పాకిస్థాన్ అణ్వాయుధాలు కేవ‌లం ర‌క్ష‌ణ కోసం మాత్ర‌మే అన్నారు. అణ్వాయుధాలు పెరుగుతున్నాయ‌న సంఖ్య త‌న‌కు తెలియ‌ద‌న్నారు. అణ్వాయుధాల‌కు తాను వ్య‌తిరేక‌మ‌ని, ఇండియాతో మూడు సార్లు యుద్ధం జ‌రిగింద‌ని, అణ్వాయుధ సామ‌ర్థ్యం పెరిగిన త‌ర్వాత త‌మ మ‌ధ్య యుద్ధాలు జ‌ర‌గ‌లేద‌ని, కేవ‌లం స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌లు మాత్ర‌మే ఉన్నాయ‌ని ఇమ్రాన్ అన్నారు.

ఒక‌సారి క‌శ్మీర్‌లో సెటిల్మెంట్ స‌మ‌స్య తీరితే, అప్పుడు రెండు పొరుగు దేశాల్లోని ప్ర‌జ‌లు నాగ‌రికుల్లా జీవిస్తార‌న్నారు. అప్పుడు అణ్వాయుధాలు అవ‌స‌రం ఉండ‌ద‌ని పాక్ ప్ర‌ధాని తెలిపారు. చైనాలో ఉయిగ‌ర్ ముస్లింపై జ‌రుగుతున్న దాడుల‌పై ప్ర‌శ్నించ‌గా.. ఆ అంశం గురించి డ్రాగ‌న్ దేశంతో అంత‌ర్గ‌తంగా చ‌ర్చిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉయిగ‌ర్ల‌ను వ‌దిలేయండి.. క‌శ్మీర్‌లో ల‌క్ష‌ల మంది చ‌నిపోయార‌ని, దాని గురించి ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. అది ఎందుకు స‌మ‌స్య కాదు అని ఇమ్రాన్ అడిగారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Delhi CM Rekha Gupta Oath: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. సిద్ధమైన రాంలీలా మైదానం, రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం, వివరాలివే

YS Jagan on Vamsi Arrest: పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి, వల్లభనేని వంశీ అరెస్ట్ అంతా ఓ కుట్ర అంటూ మండిపడిన వైఎస్ జగన్

Ramzan 2025: ముస్లిం ఉద్యోగులు గంట ముందు ఆఫీసు నుండి వెళ్లిపోవచ్చు, రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, మార్చి 2 నుంచి మార్చి 31 వరకు వర్తింపు

Earthquake In Delhi: ఢిల్లీని వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా గుర్తింపు.. ఊగిపోయిన భవనాలు.. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ అలర్ట్ (వీడియో)

Share Now