EG.5 New Variant: మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు, 51 దేశాల్లొ ఒక్కసారిగా పెరిగిన కేసులు, ప్రమాదకరంగా మారుతున్న ఈజీ-5 కోవిడ్ కొత్త వేరియంట్

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం, ఆగస్టు మొదటి వారంలో కొత్త వారపు కోవిడ్-19 ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 14% కంటే ఎక్కువ పెరిగి 10,000కి చేరుకుంది.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New COVID-19 Hospitalizations Increase as EG.5 Spreads: కొత్త ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ వ్యాప్తి చెందుతున్నందున యుఎస్‌లో కరోనావైరస్ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య పెరుగుతోంది.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం, ఆగస్టు మొదటి వారంలో కొత్త వారపు కోవిడ్-19 ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 14% కంటే ఎక్కువ పెరిగి 10,000కి చేరుకుంది. శీతాకాలపు తరంగం తర్వాత కరోనావైరస్ క్షీణించిన వసంతకాలం నుండి ఈ సంఖ్య ఇప్పుడు అత్యధికంగా ఉంది.

ఈజీ-5 అనే కొత్త వేరియంట్ అన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఈ వేరియంట్‌ను ఇప్పటికే 51 దేశాల్లో గుర్తించామని తెలిపింది. ఈజీ-5.. ఒమిక్రాన్ ఉత్పరివర్తన అని వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నా నిర్ధారణ పరీక్షల్లో ఆలసత్వం వద్దని డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను హెచ్చరించింది.

అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, చుక్కలు చూపిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఈజీ.5

ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే.. ఇంచుమించుగా ఈ కొత్త వేరియంట్‌ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. సాధారణంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో ముక్కు కారడం, తీవ్రమైన తల నొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ఆయాసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని, కొత్త వేరియంట్ ఎరిస్‌ సోకిన వారిలో ఈ లక్షణాలే కామన్‌గా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement