SSC Exams Update: ఎస్‌ఎస్‌సి విద్యార్థులకు మరో ఊరట, పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను 6కు తగ్గించిన విద్యాశాఖ, పరీక్ష సమయంతో పాటు ప్రశ్నల ఎంపికలో కూడా పెంచుతూ నిర్ణయం, వివరాలు ఇలా ఉన్నాయి

తరగతులు జరిగిన ఆధారంగా అన్ని సబ్జెక్టులకు అవసరమైన కోర్ కాన్సెప్ట్స్ కింద ఇచ్చిన సిలబస్ నుంచి ప్రశ్నలను రూపొందించాలని అధికారులను కోరారు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఫిజికల్ సైన్సెస్ పార్ట్-ఎ మరియు బయోలాజికల్ సైన్స్ పార్ట్-బి కోసం విడిగా జవాబు పుస్తకాలను జారీ చేయాలని కూడా కోరారు...

Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, February 4: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్‌ఎస్‌సి పరీక్షా పత్రాలను 11 నుంచి 6 కి తగ్గించింది మరియు పరీక్షా సమయాన్ని అరగంట పెంచింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రకారం, 2020-21 విద్యా సంవత్సరానికి ఎస్‌ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం పేపర్ల సంఖ్య తగ్గించబడింది, అంటే, విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు ఒక పేపర్ మాత్రమే రాయవలసి ఉంటుంది. సాధారణంగా రెండవ భాష మినహా ప్రతి సబ్జెక్టులో రెండేసి పేపర్లు ఉంటాయి, అయితే, ఈ సంవత్సరం, రెండు పేపర్లు కూడా ఒకే పేపర్‌లో విలీనం చేయబడతాయి.

పేపర్ల సంఖ్యను ఆరుకు తగ్గించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా పరీక్ష వ్యవధిని అరగంట పెంచింది. 2 గంటల 45 నిమిషాలకు బదులుగా, విద్యార్థులు తమ పరీక్షను 3 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేయాలి.

విద్యార్థులకు మరో ఊరట ఏంటంటే, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా తరగతులన్నీ ఆన్‌లైన్‌లో జరిగాయి కాబట్టి విద్యార్థులకు ప్రశ్నాపత్రాలలో ఛాయిస్ అనగా ప్రశ్నలలో ఎక్కువ ఎంపిక ఇవ్వబడుతుంది.

తరగతులు జరిగిన ఆధారంగా అన్ని సబ్జెక్టులకు అవసరమైన కోర్ కాన్సెప్ట్స్ కింద ఇచ్చిన సిలబస్ నుంచి ప్రశ్నలను రూపొందించాలని అధికారులను కోరారు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఫిజికల్ సైన్సెస్ పార్ట్-ఎ మరియు బయోలాజికల్ సైన్స్ పార్ట్-బి కోసం విడిగా జవాబు పుస్తకాలను జారీ చేయాలని కూడా కోరారు. అయితే, ప్రస్తుతం ఉన్న వెయిటేజ్ మార్కులలో ఎటువంటి మార్పు చేయలేదు, అనగా, ఫైనల్ పరీక్షకు 80 మార్కులు మరియు మొత్తం ఆరు పేపర్లకు ఫార్మాటివ్ అసెస్‌మెంట్ కోసం 20 మార్కులు యధాతథంగా ఉంచడం జరిగింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement