Heat Waves in AP: నేడు, రేపు ఏపీలో వడగాడ్పులు.. రాష్ట్రంలో భానుడి భగభగలు, 44 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత

సూర్యుడి ప్రతాపానికి ఆంధ్రప్రదేశ్ వాసులు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను మించిపోయాయి. ఆదివారం 73 మండలాల్లో, సోమవారం12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Temperature in Telangana (Credits: Twitter)

Vijayawada, May 28: సూర్యుడి (Sun) ప్రతాపానికి ఆంధ్రప్రదేశ్ వాసులు (AP People) అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు (Temperatures) 44 డిగ్రీలను మించిపోయాయి. ఆదివారం 73 మండలాల్లో, సోమవారం12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గుంటూరులో అత్యధికంగా 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇతర ప్రాంతాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది.

New Parliament Building Inauguration Live Updates: భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో మొదలైన సరికొత్త అధ్యాయం.. అట్టహాసంగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం.. వీడియో ఇదిగో..

చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల సెంటీగ్రేడ్

శనివారం తూర్పు గోదావరి జిల్లా చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6, బాపట్ల జిల్లా కావూరు, ఏలూరు జిల్లా పెదవేగిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి.

Sengol Handover to PM Modi: ప్రధాని మోదీ చేతికి రాజదండం, ప్రధాని నివాసాకి వచ్చి అందజేసిన 20 మంది పీఠాధిపతులు కొత్త పార్లమెంట్ భవనం కోసం సర్వం సిద్ధం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement