Farmers Protest: మరో రైతు ఆత్మహత్య, సూసైడ్‌ నోట్‌ రాసి ఉరేసుకుని చనిపోయిన జింద్‌ గ్రామానికి చెందిన కరమ్‌వీర్‌సింగ్‌, రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆత్మార్పణం చేసుకున్నాడని తెలిపిన రైతులు

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న (Farmers Protest) సంగతి విదితమే. కేంద్రానికి అక్టోబర్ 2 వరకు డెడ్ లైన్ విధించారు. అయితే కేంద్రం నుంచి స్పందన అంతంత మాత్రమే ఉండటంతో రైతులు కలత చెందుతున్నారు. తాజాగా రైతు ఉద్యమంలో పాలుపంచుకుంటున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

Image used for representational purpose | (Photo Credits: Pixabay)

New Delhi, Feb 7: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న (Farmers Protest) సంగతి విదితమే. కేంద్రానికి అక్టోబర్ 2 వరకు డెడ్ లైన్ విధించారు. అయితే కేంద్రం నుంచి స్పందన అంతంత మాత్రమే ఉండటంతో రైతులు కలత చెందుతున్నారు. తాజాగా రైతు ఉద్యమంలో పాలుపంచుకుంటున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీకి సమీపంలో చెట్టుకు ప్లాస్టిక్‌ తాడుతో ఉరేసుకుని (Haryana Farmer’s Body Found Hanging) చనిపోయాడు. రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే కలత చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిపెట్టిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

జింద్‌ గ్రామానికి చెందిన 52 ఏండ్ల కరమ్‌వీర్‌సింగ్‌ కొన్ని రోజులుగా టిక్రీ ప్రాంతంలోనే ఉంటున్నాడు. గత 74 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందిన ఆయన స్థానిక బైపాస్‌లోని కొత్త బస్ స్టాండ్ సమీపంలో (Tikri Border Protest Site) చెట్టుకు ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సివిల్‌ దవాఖానకు తరలించారు.

కదిలేది లేదు..రోడ్ల పైనే వ్యవసాయం చేస్తాం, అక్టోబర్ 2 వరకు ఇక్కడే కూర్చుంటామని తేల్చి చెప్పిన రైతు సంఘాలు, గాంధీ జయంతి వరకు కేంద్రానికి గడువు ఇస్తున్నామని వెల్లడి

అనంతరం జింద్‌ గ్రామంలోని ఆయన కుటుంబీకులకు సమాచారం అందించారు. రైతుల డిమాండ్లను కేంద్రం నెరవేర్చకపోవడంతో కరమ్‌వీర్ సింగ్‌ కలత చెంది ఆత్మహత్య చేసుకున్నారని, ఈ విషయాన్ని సూసైడ్‌ నోట్‌లో కూడా స్పష్టం చేసినట్లు అక్కడి రైతులు తెలిపారు. కరమ్‌వీర్‌ సంగ్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా, మోఘా జిల్లాలోని ధుర్కోట్‌ రాసిన్‌ ప్రాంతానికి చెందిన 60 ఏండ్ల వయసున్న దిలీప్‌సింగ్‌ కూడా ఇటీవలనే చనిపోయి కనిపించాడు. ఆయన మృతదేహాన్ని బహదూర్‌గఢ్‌ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.

రైతులకు దారుణమైన అన్యాయం జరుగుతోంది, కేంద్రానికి లేఖ రాసిన 75 మంది మాజీ సివిల్‌ సర్వెంట్ల బృందం, రైతులకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం, సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రానికి సూచన

ఆ తర్వాత పంజాబ్‌ సంగ్రూర్‌ జిల్లాలోని లోధి గ్రామానికి చెందిన బాజ్ సింగ్ కుమారుడు 70 ఏండ్ల లఖా సింగ్ కూడా ఇటీవలనే ఉద్యమ ప్రాంతంలో గుర్తుతెలియని కారణంతో చనిపోయాడు. రైతుల ఆందోళన మొదలైనప్పటి నుంచి చనిపోయిన రైతుల సంఖ్య మూడుకు చేరింది. అలాగే మొత్తం మరణించిన వారి సంఖ్య 33 కు పెరిగింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement