Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్‌ లో ఘటన (వీడియో)

ఓ హోటల్లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లిస్తుండగా ఓ యువకుడికి గుండెపోటు వచ్చింది. దీంతో కౌంటర్ వద్దే కుప్పకూలిపోయాడు.

Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్‌ లో ఘటన (వీడియో)
Heart Attack (Credits: X)

Jaipur, Mar 8: ఓ హోటల్లో (Hotel) భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లిస్తుండగా ఓ యువకుడికి గుండెపోటు (Heart Attack) వచ్చింది. దీంతో కౌంటర్ వద్దే కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌ రాజ్‌ సమంద్‌ లోని హోటల్‌ లో సచిన్ (27) అనే యువకుడు ఇటీవల భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లిస్తుండగా సచిన్ కు గుండెపోటు వచ్చింది. దీంతో సడెన్‌ గా కౌంటర్ వద్దే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి

Here's Video:

అమెరికాలో మరో తెలుగు యువకుడు

అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతిచెందాడు. గుండెపోటుతో హనుమకొండ జిల్లాకు చెందిన ఏరుకొండ రాజేశ్‌ (32) మరణించాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేశ్‌ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే రాజేశ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గుండెపోటుతో అస్వస్థతకు గురైన రాజేశ్‌ మూడు రోజుల క్రితం మరణించాడు.

టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?

(The above story first appeared on LatestLY on Aug 16, 7398 05:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).