West Bengal: పానీ పూరి తిన్న 100 మందికి వాంతులు, విరేచనాలు, నీటి కాలుష్యం వల్ల కలిగే డయేరియాగా అనుమానిస్తున్న వైద్యులు, పశ్చిమ బెంగాల్లో ఘటన
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో పానీ పూరి తిని వంద మందికి పైగా అస్వస్ధతకు (100 People Fell Sick) గురయ్యారు. సుగంధ గ్రామంలోని డొగచియ ప్రాంతంలోని ఓ దుకాణంలో పానీపూరి తిన్న తర్వాత (Eating Pani Puri) వీరంతా అనారోగ్యానికి లోనయ్యారు.
Kolakata, August 11: పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో పానీ పూరి తిని వంద మందికి పైగా అస్వస్ధతకు (100 People Fell Sick) గురయ్యారు. సుగంధ గ్రామంలోని డొగచియ ప్రాంతంలోని ఓ దుకాణంలో పానీపూరి తిన్న తర్వాత (Eating Pani Puri) వీరంతా అనారోగ్యానికి లోనయ్యారు. వారిలో డయేరియా లక్షణాలు కనిపించాయి.నీటి కాలుష్యం వల్ల కలిగే డయేరియాగా వైద్యులు అనుమానిస్తున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారు.
ఈ సంఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని ఔషధాలు అందించారు. పలువురు తీవ్రంగా ప్రభావితమైన క్రమంలో ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అస్వస్థతకు గురైన వారిలో డొగచియా, బహిర్ రనగచా, మకల్టాలా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వైద్యారోగ్య శాఖ ప్రత్యేక బృందాలను పంపగా రోగులకు మందులు అందించారు. తీవ్ర అస్వస్దతకు లోనైన వారిని ఈ బృందం గుర్తించి ఆస్పత్రుల్లో చేర్పించింది. స్ట్రీట్ స్టాల్లో పానీపూరి తిని అస్వస్ధతకు గురైన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.