Chhattisgarh Shocker: వేరే యువతితో ప్రియుడి పెళ్ళి, మగవాడి వేషంలో వచ్చి వరుడిపై యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు, పెళ్లి పీటల మీద ఉండగానే వధూవరులపై దాడి

మరో మహిళను పెళ్లాడుతున్న ప్రియుడిపై అతడి ప్రియురాలు యాసిడ్‌తో దాడి (Acid Attack) చేసింది. దీంతో వధువరులతోపాటు మరో పది మంది గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Wedding Representational Image

Jagdalpur, April 24: మరో మహిళను పెళ్లాడుతున్న ప్రియుడిపై అతడి ప్రియురాలు యాసిడ్‌తో దాడి (Acid Attack) చేసింది. దీంతో వధువరులతోపాటు మరో పది మంది గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తన మాజీ ప్రియుడు మరో యువతితో పెళ్లి చేసుకోబోతుండగా అతడిపై యాసిడ్‌ విసిరిన 22 ఏళ్ల యువతిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ర్యాప్తులో నేరంలో ఆమె ప్రమేయం బయటపడడంతో ఆదివారం నిందితురాలిని అరెస్టు చేసినట్లు బస్తర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ నివేదిత పాల్ తెలిపారు.

ఏప్రిల్ 19న భాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోటే అమాబల్ గ్రామంలో వరుడు దమ్రుధర్ బాఘేల్ (25) 19 ఏళ్ల యువతితో వివాహం జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. యాసిడ్ దాడిలో వరుడు, వధువుతో పాటు హాజరైన 10 మందికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. పోలీసులు గుర్తుతెలియని నిందితురాలిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 326 A (స్వచ్ఛందంగా యాసిడ్ వాడకం ద్వారా తీవ్రంగా గాయపరచడం మొదలైనవి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మహిళతో ఆ పని చేస్తూ దొరికిపోయిన మంత్రి, వీడియోని షేర్ చేసిన బీజేపీ నేతలు, ఆ వీడియో నకిలీదని,ఎడిట్ చేసిందని పేర్కొన్న జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా

"మేము గ్రామంలో ఏర్పాటు చేసిన కొన్ని సిసిటివి కెమెరాల ఫుటేజీని స్కాన్ చేసాము, ఇన్ఫార్మర్లను యాక్టివేట్ చేసాము. వధువు, వరుడి నేపథ్యాన్ని తనిఖీ చేసాము" అని పోలీసు అధికారి తెలిపారు. సాయంత్రం వేళల్లో ఈ ఘటన జరగడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నిందితురాలిని చూడలేకపోయారని ఎమ్మెల్యే పాల్‌ తెలిపారు.

వరుడి మాజీ ప్రేయసి అయిన మహిళ ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడి కావడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. దామ్రుధర్‌పై తానే యాసిడ్‌తో దాడి చేసినట్లు అతడి ప్రియురాలు ఒప్పుకుంది. తనకు, దమ్రుధర్ బఘెల్‌తో గత కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్ ఉందని, మరో మహిళను పెళ్లి చేసుకుని దమ్రుధర్ తనను మోసం చేశాడని నిందితురాలు పోలీసులకు చెప్పిందని, ఎమ్మెల్యే పాల్ చెప్పారు.

భార్య గర్భంతో ఉన్నదన్న కారణంతో బెయిల్ ఇవ్వడం కుదరదు.. డ్రగ్స్ నిందితుడి కేసు విచారణలో పంజాబ్-హర్యానా హైకోర్టు

"దమ్రుధర్ వివాహం గురించి తెలుసుకున్న మహిళ, దాడికి ప్లాన్ చేసి, ఆమె పనిచేసే మిరప పొలంలో యాసిడ్ దొంగిలించింది," అని పోలీసు అధికారి తెలిపారు, పొలంలో డ్రిప్ వ్యవస్థను శుభ్రం చేయడానికి ఈ యాసిడ్ ఉపయోగించబడుతుంది. నేరం చేస్తున్న సమయంలో తన గుర్తింపును దాచిపెట్టేందుకు నిందితురాలు పురుషుడి వేషం ధరించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో, కబీర్‌ధామ్ జిల్లాలో దంపతులకు బహుమతిగా ఇచ్చిన హోమ్ థియేటర్ మ్యూజిక్ సిస్టమ్‌లో బాంబును అమర్చినందుకు కొత్తగా పెళ్లయిన మహిళ మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. సామగ్రిలో పేలుడు సంభవించడంతో మహిళ భర్త, అతని అన్నయ్య మరణించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement