CM KCR Delhi Tour:త్వరలోనే సంచలనం జరుగబోతోంది! ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్, కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలో స్కూల్, హాస్పటల్ సందర్శించిన కేసీఆర్

విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమని సీఎం కేసీఆర్‌ (CM KCR)అన్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో(Kejriwal) కలిసి కేసీఆర్‌ దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ పాఠశాలను సందర్శించారు. కేసీఆర్‌ బృందానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా (Manish Sisodia) ఘన స్వాగతం పలికారు.

New Delhi, May 22: విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమని సీఎం కేసీఆర్‌ (CM KCR)అన్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో(Kejriwal) కలిసి కేసీఆర్‌ దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ పాఠశాలను సందర్శించారు. కేసీఆర్‌ బృందానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా (Manish Sisodia) ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పాఠశాలకు సంబంధించిన డాక్యుమెంటరీని కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్‌ (KCR) వీక్షించారు. పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు వివరించారు. పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి సీఎంలు ఇద్దరు గ్రూప్‌ ఫొటో దిగారు.

ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. కేజ్రీవాల్‌ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. విద్యార్థులను జాబ్‌ సీకర్లుగా కాకుండా జాబ్‌ ప్రొవైడర్లుగా మార్చుతున్నారన్నారు. ఇంత పెద్ద జనసంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరమన్నారు. తెలంగాణలోనూ ఈ విధానం అమలు చేస్తామని చెప్పారు. ఇందు కోసం తెలంగాణ ఉపాధ్యాయులను ఢిల్లీకి పంపిస్తామని, ఢిల్లీ బోధనా విధానాలను అధ్యయం చేయాలని చెప్పామన్నారు. ఢిల్లీ బోధనా విధానాలు దేశానికి మొత్తం ఆదర్శనీయమన్నారు.

Telangana Police Recruitment: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్, పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితి మరో రెండేళ్లు పొడిగింపు 

పాఠశాల పనితీరు (School), కాన్సెప్ట్‌ బాగుందని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అఖిలేష్‌, కేజ్రీవాల్‌తో భేటీపై ప్రస్తావించారు. ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదని, పవిత్రస్థలంలో ఉన్నాం కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దన్న కేసీఆర్‌.. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం, ఘటనపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన కాకినాడ ఎఎస్పీ శ్రీనివాస్  

రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుతామన్నారు. దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉందని, ఆ సంచలనం జరిగి తీరుతుందని చెప్పారు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అందరూ చూస్తారన్నారు. అనంతరం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్‌ మహమ్మద్‌పూర్‌ మొహల్లా క్లినిక్‌ను సందర్శించారు. అక్కడ అందిస్తున్న సేవలను అధికారులు కేసీఆర్‌కు వివరించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Advertisement
Advertisement
Share Now
Advertisement