Weight Loss: బరువు తక్కువ కావడానికి మందులు వాడుతున్నారా? అయితే, జాగ్రత్త.. కంటిచూపు పోయే ప్రమాదం ఉంది మరి!

మారుతున్న ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణంగా ఊబకాయం, మధుమేహం పెను సమస్యగా మారింది. దీంతో ఒబెసిటీ, డయాబెటిస్‌ బాధితులు విరివిగా మందులు వాడుతున్నారు.

weight (Credits: X)

Newdelhi, July 5: మారుతున్న ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణంగా ఊబకాయం (Obesity), మధుమేహం (Diabetes) పెను సమస్యగా మారింది. దీంతో ఒబెసిటీ, డయాబెటిస్‌ బాధితులు విరివిగా మందులు వాడుతున్నారు. అయితే, ఈ ఔషధాల వల్ల ‘నాన్‌-ఆర్టెరిటిక్‌ ఆంటీరియర్‌ ఇషెమిక్‌ ఆప్టిక్‌ న్యూరోపతి’ అనే అరుదైన కంటి సమస్య (Blindness) వచ్చే ముప్పు ఏడు రెట్లు ఎక్కువ ఉందని తాజాగా వెల్లడైంది. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఐ అండ్‌ ఇయర్‌ హాస్పిటల్‌ పరిశోధకుల బృందం చేసిన ఈ అధ్యయనంలో తేలింది.

బీఆర్ఎస్‌ కు కోలుకోలేని దెబ్బ.. అర్ధరాత్రి కాంగ్రెస్‌ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రే చేరికలు..

ప్రమాదం ఇలా..

మధుమేహం ఉన్న వారికి ఇన్సులిన్‌ స్థాయిలను పెంచేందుకు, ఊబకాయంతో బాధపడుతున్న వారికి బరువు తగ్గేందుకు (Weight Loss) గానూ ఒజెంపిక్‌, విగోవి వంటి ఔషధాలను ఇస్తున్నారు. అయితే, సెమాగ్లుటైడ్‌ అనే ప్రొటీన్‌ ఉన్న ఈ మందులు వాడే ఊబకాయ బాధితులకు మిగతా వారి కంటే ‘నాన్‌-ఆర్టెరిటిక్‌ ఆంటీరియర్‌ ఇషెమిక్‌ ఆప్టిక్‌ న్యూరోపతి’ సమస్య వచ్చే అవకాశం ఏడు రెట్లు ఎక్కువ ఉందని పరిశోధకులు గుర్తించారు. మధుమేహ బాధితులకు ఈ ముప్పు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల హఠాత్తుగా ఒక కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ, రాజకీయాలు ఎన్నికల వరకేనని వెల్లడి, వివిధ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement