Shock to BRS: బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ.. అర్ధరాత్రి కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రే చేరికలు..
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కుదేలైన బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Hyderabad, July 5: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో (Assembly Elections) కుదేలైన బీఆర్ఎస్ (BRS) పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న వెంటనే జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సమావేశం జరిగింది. అనంతరం ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు కూడా ఆరుగురు ఎమ్మెల్సీలు దస్ పల్లా హోటల్ లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో వీరందరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
బీఆర్ఎస్ కి మరో భారీ షాక్...కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్సీ లు |6 MLCs are Joined in Congress |hmtvhttps://t.co/g0fL9K40NP#brspartynews #congressparty #cmrevanthreddy #hmtv
— hmtv News (@hmtvnewslive) July 5, 2024
పార్టీ మారిన వారు వీళ్లే..
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్సీలు దండె విఠల్, భాను ప్రసాద్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, బస్వరాజ్ సారయ్య ఉన్నారు. తాజా చేరికలతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కు పెరిగింది. మొత్తం మండలిలో సభ్యుల సంఖ్య 40 ఉండగా.. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
(The above story first appeared on LatestLY on Jul 05, 2024 08:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

