Tirumala Token Booking: డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు, నవంబర్ 27 నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్ల రిజిస్ట్రేషన్, సామాన్య భక్తులకు ప్రాధాన్యం.. తొలి మూడు రోజులు సర్వదర్శనానికే

డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు మొత్తం 10 రోజులు భక్తులకు వైకుంఠ ద్వారాల ద్వారా స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ భక్తుల సౌకర్యం దృష్ట్యా పలు కీలక మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు.

Tirumala

తిరుమల శ్రీవారి దర్శనానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్తను ప్రకటించింది. ప్రతి సంవత్సరం విశేషంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఈసారి తేదీలను అధికారికంగా వెల్లడించింది.

ఈ సందర్భంగా మొదటి మూడు రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 నాడు పూర్తిగా సర్వదర్శన భక్తులకు మాత్రమే కేటాయించారు. ఈ మూడు రోజులకు గాను 1.88 లక్షల సర్వదర్శన టోకెన్లు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో అందించనున్నారు. ఈ టోకెన్లు మొత్తం DIP (Divya Darshan Incentive Programme) విధానంలోనే జారీ అవుతాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 వరకు కొనసాగుతుండగా, డిసెంబర్ 2 నుంచి టోకెన్ల వినియోగం ప్రారంభమవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు, సామాన్యులు కొనలేక విలవిల, జనవరి వరకు ఇదే పెరుగుదల ఉంటుందని చెబుతున్న మార్కెట్ వర్గాలు

మిగతా ఏడు రోజులు జనవరి 2 నుండి 8 వరకు ప్రతిరోజూ 15,000 సర్వదర్శన టోకెన్లు, అదనంగా 1,000 శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టోకెన్లు కేటాయించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. సామాన్య భక్తులకు దర్శన సమయం పెరగడానికి వీలుగా ఈసారి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని గణనీయంగా తగ్గించారు. మొత్తం 184 గంటల దర్శన సమయాల్లో 164 గంటలు పూర్తిగా సర్వదర్శనానికే కేటాయించినట్లు అధికారులు వివరించారు. తొలి రోజున వీఐపీ బ్రేక్‌ను 4 గంటలు 45 నిమిషాలకు, మిగతా రోజుల్లో గరిష్ఠం 2 గంటలకు మాత్రమే పరిమితం చేశారు.

ఈ పది రోజుల వైకుంఠ దర్శనాలకు సుమారు 8 లక్షల మంది భక్తులు విచ్చేయవచ్చని టీటీడీ అంచనా వేసింది. టోకెన్ల బుకింగ్ కోసం భక్తులు అధికారికంగా TTD వెబ్‌సైట్ – tirupatibalaji.ap.gov.in ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement