
Arasavalli, Mar 10: శ్రీకాకుళం జిల్లాలోని ప్రఖ్యాత అరసవెల్లి (Arasavalli) సూర్యనారాయణ స్వామి ఆలయం గురించి తెలియని తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలు లేరు. సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ ను తాకే అద్భుత దృశ్యాన్ని చూడాలనుకునే భక్తులు లక్షల మంది ఉంటారు. అయితే, ఆ భక్తులకు వరుసగా రెండో రోజు నిరాశ ఎదురైంది. సోమవారం ఉదయం కూడా సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ ను తాకలేకపోయాయి. ప్రతి సంవత్సరం రెండుసార్లు జరిగే ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే, పొగమంచు, మేఘాలు ఆటంకంగా ఉండటంతో స్వామివారి మూలవిరాట్ ను కిరణాలు తాకలేకపోయాయి.
సూర్యనారాయణ స్వామివారిని తాకని సూర్య కిరణాలు
శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దివ్యక్షేత్రంలో సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకే అద్భుత ఘట్టం
ఏటా దక్షిణాయణం అక్టోబర్ 1, 2 తేదీల్లో, ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీల్లో ఆవిష్కృతమయ్యే ఘట్టం
పొగమంచు కారణంగా ఈసారి… pic.twitter.com/Sr4q1T4Mbe
— BIG TV Breaking News (@bigtvtelugu) March 10, 2025
ఆదివారం కూడా ఇదే పరిస్థితి
ఉత్తరాయణ, దక్షిణాయణ కాలాల్లో మార్పుల సమయంలో, ప్రతి సంవత్సరం మార్చి 9, 10 మరియు అక్టోబర్ 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి విగ్రహాన్ని తాకడం ఆనవాయితీగా వస్తోంది. మార్చి 9 అంటే ఆదివారం సెలవు దినం కావడంతో, సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయని భావించి వేలాదిగా భక్తులు ఉదయం 6 గంటలకే ఆలయానికి చేరుకున్నారు. భక్తులు సూర్యకిరణాల కోసం వేచి చూసినప్పటికీ, మేఘాల కారణంగా కిరణ స్పర్శ జరగలేదు. నేడైనా ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం కలుగుతుందేమోనని భక్తులు ఎదురుచూసినా నేడు కూడా ఆ భాగ్యం దక్కలేదు.
ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్