Momo Eating Challenge: ప్రాణాలు తీసిన మోమో ఛాలెంజ్.. పందెం కాసి 150 మోమోలు తిని ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. బీహార్‌లోని చంపారన్ జిల్లాలో ఘటన

సరదాగా కాసిన పందేలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు తీసుకొస్తాయి. ఇదీ అలాంటి ఘటనే. స్నేహితులతో సరదాగా కాసిన పందెం ఓ యువకుడి నిండుప్రాణం తీసింది. బీహార్‌లో జరిగిందీ ఘటన.

Momo (Credits: Twitter)

Hyderabad, July 16: సరదాగా కాసిన పందేలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు తీసుకొస్తాయి. ఇదీ అలాంటి ఘటనే. స్నేహితులతో సరదాగా కాసిన పందెం ఓ యువకుడి నిండుప్రాణం తీసింది. బీహార్‌లో (Bihar) జరిగిందీ ఘటన. తూర్పు చంపారన్ జిల్లాలోని సిహోర్వా గ్రామానికి చెందిన విపిన్ కుమార్ పాశ్వాన్ (25) సివాన్ జిల్లాలోని గ్యానీమోర్ సమీపంలో ఓ మొబైల్ రిపేర్ దుకాణం (Mobile Repair Shop) నిర్వహిస్తున్నాడు. రోజువారీలానే గురువారం షాప్‌కు వెళ్లాడు. సాయంత్రం స్నేహితులను కలిశాడు. ఈ క్రమంలో ఎవరు ఎక్కువ మోమోలు (Momo) తింటారన్న విషయంలో వారి మధ్య పందెం మొదలైంది. ఈ క్రమంలో 150 మోములు తిన్న పాశ్వాన్ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు.

Nithya Menen: స్టార్ హీరోయిన్ నిత్య మేనన్ ఇంట్లో పెను విషాదం.. నిత్య అమ్మమ్మ మృతి.. సోషల్ మీడియాలో వెల్లడి.. ఒక శకం ముగిసిందంటూ తీవ్ర భావోద్వేగం

హత్యేనంటున్న కుటుంబీకులు

ఆ తర్వాత అతడి మృతదేహం గోపాల్‌గంజ్, సివాన్ జిల్లాల సరిహద్దులోని రోడ్డుపక్కన అనుమానస్పద స్థితిలో పడి ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, విపిన్ తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. తన కుమారుడికి విషం పెట్టి చంపారని ఆయన తండ్రి విష్ణు మాంఝీ ఆరోపిస్తున్నారు.

Abhishek Bachchan: రాజకీయాల్లోకి రానున్న అభిషేక్ బచ్చన్? ఎస్పీ తరపున ప్రయాగ్‌ రాజ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు వార్త హల్‌ చల్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement